హైదరాబాద్ బిట్స్ పిలానీ విద్యార్థి ఆత్మహత్య: బ్లూవేల్ గేమా, ప్రేమ వ్యవహారమా?
హైదరాబాద్: రాజేంద్రనగర్ సన్ సిటీలో బిట్స్ పిలానీ విద్యార్థి వరుణ్ (19) ఆత్మహత్య చేసుకున్నాడు. అతను బ్లూ వేల్ గేమ్కు బానిస కావడం వల్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ను మెడకు చుట్టుకొని రెండు రోజుల క్రితం ప్రాణాలు తీసుకున్నాడు.
వరుణ్ నాలుగు రోజుల నుంచి గదిలోనే ఉంటున్నాడు. ల్యాప్ టాప్లో గేమ్ ఆడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ గేమ్ బ్లూవేల్ గేమ్ అయి ఉంటుందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

బ్లూవేల్ గేమ్ కారణంగా ఆత్మహత్య అని
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీలో ఆత్మహత్య చేసుకున్న బిట్స్ పిలానీ ఇంజినీరింగ్ విద్యార్థి వరుణ్ కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. వరుణ్ వీడియో గేమ్లు బాగా ఆడేవాడని సన్నిహితులు చెప్పడంతో బ్లూ వేల్ గేమ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తొలుత అనుమానించారు.

పలుమార్లు మందలించిన తల్లి
మూడు నాలుగు రోజుల పాటు గదిలో ల్యాప్టాప్కు అతుక్కుపోవడంతో తల్లి అతనిని పలుమార్లు మందలించారు. అతనిని మందలించి భోజనం పెట్టినట్లుగా చెబుతున్నారు. మరోవైపు విషయం తెలిసిన తండ్రి ఇంటర్ నెట్ కనెక్షన్ తొలగించారు. అయితే తన మొబైల్ డాటా హాట్ స్పాట్ ద్వారా ల్యాప్టాప్కు అనుసంధానించి మళ్లీ నెట్ వినియోగించారని చెబుతున్నారు.

ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని చేయడంతో గేమ్ వల్లేనని అనుమానం
ఈ క్రమంలో వరుణ్ మెడకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఊపిరాడకుండా చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో బ్లూవేల్ అలవాటు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడా మరేమైనా కారణం ఉందా అని పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు ల్యాప్టాప్ను పరిశీలిస్తున్నారు.

ఆట కాకుండా మరేమైనా కారణముందా అని దర్యాఫ్తు
వరుణ్ ఆత్మహత్యకు ఆటనే కారణమా లేక మరేదైనా ప్రేమ వ్యవహారం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది. వరుణ్ సెల్ ఫోన్ ఆధారంగా అతను ఎవరితో ఎక్కువసేపు మాట్లాడేవాడు, అతని స్నేహితులు ఎవరు అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications