తల్లిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చేశారు (ఫోటోలు)
హైదరాబాద్: ఆస్తికోసం కన్న తల్లిని కుమారుడు గత ఏడాది జనవరిలో హత్య చేసి ఇంట్లోనే పాతి పెట్టారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదుతో టాస్క్ ఫోర్స్ బృందాలు గత ఏడాది జనవరిలో అదృశ్యమైనట్లు భావిస్తున్న మహిళ హత్యకు గురైందన్న నిజాన్ని వెలుగులోకి తెచ్చాయి.
షాహినాయత్గంజ్ ఇన్స్పెక్టర్ సత్తయ్య కథనం ప్రకారం .. గోషామహల్ ఓల్డ్ తోప్ఖానాలో నివాసముండే లక్ష్మి అలియాస్ ఆషాకి కుమారుడు బాబు, కూతురు కిరణ్ ఉన్నారు. మొదటి భర్త భజన్రాజ్ దాదాపు 25 ఏళ్ల క్రితం మృతి చెందాడు.
తల్లిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన కొడుకు
అనంతరం ఆమె ఆసిఫ్నగర్ ప్రాం తానికి చెందిన జమాలుద్దీన్ను వివాహం చేసుకుంది. వేరువేరు మతాలకు చెందిన వారవ్వడంతో కొడుకు, కూతురుకు వివాహ సంబంధాలు చుసేటప్పుడు కలహాలు మొదలైనట్లు సమాచారం.
తల్లిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన కొడుకు
దీంతో తమ వాటా ఆస్తిని రాసివ్వాల్సిందిగా తల్లిపై కొడుకు, కూతురు ఒత్తిడి తెచ్చారు. ఆమె ససేమేరా అనడంతో గత సంవత్సరం జనవరి 13న ఆస్తి విషయమై తల్లి, కుమారుడి మధ్య గొడవ జరిగింది. కోపంతో కుమారుడు తల్లిని కర్రతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
తల్లిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన కొడుకు
తన స్నేహితుడు నజీర్ సహాయంతో తల్లి మృతదేహాన్ని బాబు జనవరి 14న ఇంట్లోనే పూడ్చి పెట్టాడు. పాలిష్ స్టోన్లు వేయించి ఆ మల్గీని అద్దెకు ఇచ్చారు. లక్ష్మీబాయి గురించి ఆరా తీసిన జమీలుద్దీన్కు ముంబై వెళ్లిందని ఒకసారి, బెంగుళూరు వెళ్లిందని మరోసారి చెప్పారు.
తల్లిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన కొడుకు
వీరిపై అనుమానంతో ఆమె రెండో భర్త జమాలుద్దీన్ ఈ నెల 8న షాహినాయత్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోషామహల్ ఏసీపీ రాంభూపాల్రావు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సత్తయ్య కేసు నమోదు చేసుకుని బాబును అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.
తల్లిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన కొడుకు
ఫోరెన్సిక్ వైద్యులు ప్రొఫెసర్ డాక్టర్ జనార్దన్ బృందం, నాంపల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉదయం ఇంట్లో తవ్వి అస్థిపంజరాలను బయటకు తీశారు. దుస్తులు కూడా లభించాయి. పంచనామా చేసి ఉస్మానియా మార్చురీకి తరలించారు.
తల్లిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన కొడుకు
గోషామహల్ ఏసీపీ కె.రాంభూపాల్రావు, షాహినాయత్ గంజ్ ఇన్స్పెక్టర్ సత్తయ్య పర్యవేక్షించారు. అనంతరం ఏసీపీ రాంభూపాల్రావు మాట్లాడుతూ ఆస్తి కోసమే తల్లిని ఆమె కుమారుడు హత్య చేసి ఇంట్లో పూడ్చాడన్నారు. బాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.