ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల- బీఆర్ఎస్ నేత లాజిక్ ఇదీ..!!
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే- ఆమె ముఖ్యమంత్రి అవుతుందని అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి.. వార్షిక బడ్జెట్ కు సంబంధించిన విమర్శల సునామీని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై మండిపడుతున్నారు. దీన్ని ఎన్నికల స్టంట్ గా అభివర్ణిస్తోన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, స్థలాలు, రుణ మాఫీ గురించి ప్రస్తావించలేదని, హరీష్ రావు అంకెల గారడీ తప్ప బడ్జెట్ లో ఏమీలేదని విమర్శించారు.

కొత్త సీసాలో పాతసారా..
ఈ బడ్జెట్ ప్రతిపాదనలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శలు గుప్పించారు. మంత్రి హరీశ్ రావు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌజ్ కు వెళ్లారని, ఆయన మామ కేసీఆర్ అందులో పాత సారా పోసి పంపించారని ఎద్దేవా చేసారు. గత ఏడాదికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలను ప్రజల ముందు ఉంచగలరా? అని ప్రశ్నించారు. కొత్త ప్రతిపాదనలేవీ లేవని, గత ఏడాది బడ్జెట్ లోని అంశాలనే కాపీ పేస్ట్ చేశారనీ చురకలు అంటించారు.

కడియం శ్రీహరి అటాక్..
వైఎస్ షర్మిల చేసిన విమర్శలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు కడియం శ్రీహరి ఘాటుగా బదులిచ్చారు. ఈ విషయంలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా లాగారు. రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం, వైఎస్ జగన్ ఆస్తుల కేసులో సీబీఐ చేపట్టిన దర్యాప్తు విషయాన్నీ ప్రస్తావించారు.

త్వరలో జైలుకు..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనో.. సీబీఐ కేసులోనో వైఎస్ జగన్ రేపో మాపో జైలుకు వెళ్లడం ఖాయమని, అప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలకు అవకాశం లభిస్తుందని అన్నారు. తెలంగాణ గురించి ఏమీ తెలియని షర్మిల ఏకంగా బడ్జెట్ పై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణకు వైఎస్ కుటుంబం మొదటి నుంచీ వ్యతిరేకమేనని ఆరోపించారు. గతంలో సమైక్యాంధ్ర నినాదంతో షర్మిల పాదయాత్ర చేశారని విమర్శించారు.

తెలంగాణకు షర్మిల అవసరం లేదు..
సమైక్యాంధ్ర కోసం పని చేసిన షర్మిల లాంటి నాయకులు తెలంగాణ సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడటం సరికాదని కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణకు ఆమె అవసరం లేదని తేల్చి చెప్పారు. ఏపీకి వెళ్లి అక్కడ రాజకీయాలు చేసుకోవచ్చని, దానికి ఎవరి అభ్యంతరం ఉండదని సూచించారు. ఏపీకి వెళ్లి అక్కడి ప్రజలకు మెురపెట్టుకోవాలని అన్నారు. రేపోమాపో జగన్ జైలుకు పోతే ఏపీలో ముఖ్యమంత్రిగా షర్మిలకే అవకాశం వస్తుందని వ్యాఖ్యానించారు.

జగన్ జైలులో ఉన్నప్పుడూ..
జగన్ ఇదివరకు జైలులో ఉన్నప్పుడు కూడా షర్మిల పాదయాత్ర చేశారని, ఇప్పుడు కూడా తెలంగాణలో ఊరూరా తిరుగుతున్నారని కడియం శ్రీహరి అన్నారు. దీనివల్ల తెలంగాణలో ఆమెకు ఎలాంటి ఉపయోగం ఉండబోదని చెప్పారు. ఏపీకి వెళ్తే సీఎం అవుతుందని అన్నారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక షర్మిలకు అన్యాయం చేశారని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పడం వల్ల లాభం ఉండదని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications