జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. భూతగాదాలతో తండ్రి, ఇద్దరు కుమారుల దారుణ హత్య
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని గంగారం గ్రామంలో భూ వివాదాలకు ముగ్గురు బలైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గంగారం గ్రామంలో పొలం విషయంలో రెండు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. దాదాపు 15 సంవత్సరాలుగా ఈ రెండు కుటుంబాల మధ్య పొలం విషయంలో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో మరోమారు పొలం విషయంలో తేల్చుకుందాం రమ్మని ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడం కోసం పొలం వద్ద సమావేశమయ్యాయి. మాట్లాడుతున్న క్రమంలో మాట మాట పెరిగి గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అతి దారుణంగా గొడ్డలితో నరికి హతమార్చారు. ఈ ఘర్షణలో ముగ్గురు మరణించారు.

మంజా నాయక్ ఆయన పెద్ద కుమారుడు సారయ్య, చిన్న కుమారుడు భాస్కర్ లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నిందితుడు మాంకాలి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం భూపాలపల్లి ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications