Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కాగా, శుక్రవారంనాడు గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసససభను స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​ శనివారానికి వాయిదా వేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్(TS Budget)​ను ప్రవేశపెట్టనుంది.

కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి బడ్జెట్ కావడంతో కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాలు అమలు లాంటి అంశాలపై ఈ బడ్జెట్‌లో స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ఈ సమావేశాలకు శనివారం ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా అనేది ఉత్కంఠగా ఉంది.

budget to be introduced congress govt in Telangana assembly today

శనివారం ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్​‌ను మంత్రివర్గం ఆమోదించనుంది. కాగా, శాసనసభలో జరిగిన చర్చలో భాగంగా శుక్రవారం ఉదయం గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముందుగా ఎమ్మెల్యే వేముల వీరేశం తీర్మానాన్ని ప్రతిపాదించారు. అనంతరం ఆ తీర్మానాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి సభలో బలపరిచారు. అనంతరం సభలో సభ్యులు ఒక్కొక్కరుగా మాట్లాడారు.

తెలుగుజాతి ముద్దు బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, సభలోని సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సభను ఉద్దేశిస్తూ సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. విపక్ష నేతల ప్రశ్నలకు, రాష్ట్రాభివృద్ధిని వివరిస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. బీఆర్​ఎస్​, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష సభ్యులు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో సభా వాడీవేడిగా సాగింది.

నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని, జెరాక్స్​ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్లం తాము కాదని బీఆర్ఎస్‌ కీలక నేతలకు సీఎం రేవంత్​ రెడ్డి చురకలంటించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చే 15 రోజుల్లోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. త్వరలోనే గ్రూప్​ -1 నోటిఫికేషన్ ఇస్తామని, వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు. హామీలను నెరవేరుస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+