కేసీఆర్ అలా జాతీయ పార్టీని ప్రకటించిండో లేదో..ఇలా ఆర్జీవీ ఇచ్చి పడేసిండు..!!
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఓ కీలక ఘట్టం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇక.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. ఊహించినట్టే- ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన ఈ ఎనిమిది సంవత్సరాల వ్యవధిలోనే తన స్థాయిని పెంచుకున్నారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సారథిగా, రెండుసార్లు వరుసగా అధికారాన్ని అందుకున్న అనుభవం ఉందాయనకు. జాతీయ రాజకీయాల్లో ఎలా రాణించగలుగుతారనేది ఆసక్తి రేపుతోంది.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్పు చేస్తూ- పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించింది. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయాన్ని కేసీఆర్ ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడానికి గల కారణాలను వివరించారు. దీని కోసం ప్రత్యేక అజెండాను రూపొందించుకున్నామని స్పష్టం చేసారు.

దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తోన్నాయంటూ ఇదివరకే ఆయన పలు సందర్భాల్లో బీజేపీపై విమర్శనాస్త్రాలను సంధించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ఎదిగే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలను కలుపుకొనేలా కసరత్తు మొదలు పెట్టారు. కర్ణాటకకు చెందిన జనతాదళ్ (సెక్యులర్).. కేసీఆర్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
By Making TRS into BRS , KCR became the AdiPurush (1stMan) to do it ..Welcome to NATIONAL POLITICS 💐
— Ram Gopal Varma (@RGVzoomin) October 5, 2022
తమిళనాడుకు చెందిన కొన్ని పార్టీల నాయకులు కేసీఆర్ వెంట నడవడానికి సిద్ధపడ్డారు. మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్ వంటి జాతీయ స్థాయి ప్రతిపక్ష నేతలు కేసీఆర్ను స్వాగతించే అవకాశం లేకపోలేదు. కాగా కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన వెంటనే- సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ స్పందించారు. కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి స్వాగతం పలికారు. ఆదిపురుష్గా సంబోధించారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం ద్వారా కేసీఆర్ ఆదిపురుష్ అయ్యారని వ్యాఖ్యానించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications