ఓటుకు నోటు కేసు నిందితుడి మత్యయ్య సికింద్రాబాదులో ప్రత్యక్షం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య సికింద్రాబాదులో ప్రత్యక్షమయ్యారు. ఆయన సమాజ్వాదీ పార్టీ మీడియా కో ఆర్డినేటర్గా తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు నాగలక్ష్మి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు.
వచ్చే గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నిక్లలో 150 డివిజన్లలో తమ పార్టీ పోటీ చేస్తుందని మత్తయ్య చెప్పారు. వంద సీట్లకు పైగా తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఐదవ వార్డు జ్యోతి కాలనీలో సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులను వివిధ పార్టీ పదవుల్లో నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా ఎఎస్ శ్రీనివాస్, మీడియా కోఆర్డినేటర్గా జెరూసలేం మత్తయ్యకు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లయన్ సీ ఫ్రాన్సిస్, సెక్రటరీ జనరల్ సుజాన్, ఆర్గనైజర్ చంద్రశేఖర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఓటుకు నోటు సంఘటన వెలుగు చూడగానే మత్తయ్య తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు చిక్కకుండా పారిపోయారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలదాచుకుంటున్నట్లు చెబుతూ వచ్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications