నోటీసు: ప్రధానికి, రాష్ట్రపతిలకు ఫిర్యాదు చేయనున్న టీ న్యూస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలతోపాటు ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని టీ న్యూస్ సీఈవో నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు నోటీసులు ఇవ్వడమనేదే తప్పన్నారు. ఏపీ పోలీసులకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా శనివారం ఏసీబీ డీజీ ఏకే ఖాన్, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ను కలిశారు. పరిస్థితిని వివరించారు.
కాగా, తెలంగాణలో మీడియాకు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడుతోందని తెలుస్తోంది. అంతేకాదు, ఏపీ నుండి పోలీసు బలగాలను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని కేంద్రాన్ని కోరనుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications