బాబు కేసీఆర్ మధ్య రాజీ..!: చాడా, ఆ సీఎం ఆత్మ కెసిఆర్లో: నాగం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసుని తెలంగాణ సర్కార్ నీరు గారుస్తుందని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు విషయంలో ప్రధాన నిందితులను వదిలి క్రింది స్ధాయి వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నారని అన్నారు.
దీనిని బట్టి చూస్తుంటే, చంద్రబాబు, కేసీఆర్ మధ్య రాజీ కుదిరనట్లు ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇక పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి సీపీఐ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
కేసీఆర్ వైఖరిపై మండిపడ్డ నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంభిస్తున్న వైఖరిపై బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ పేద రాష్ట్రంగా ఎలా మారిందో వివరించాలని అన్నారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని ఆంధ్రా వాళ్ల చేతిలో పెడుతున్నారని మండిపడ్డారు. ఇక తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను పక్క రాష్ట్రాలు ఆపలేవని అన్నారు.
గతంలో ఓ సీఎంని ఆవహించిన ఆత్మే ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ను ఆవహించిందన్నారు. ఆ ఆత్మ మీద ఆధారపడే కెసిఆర్ సర్కారు నడుస్తోందన్నారు. కెసిఆర్ తన అనుచర వరగానికే పెద్ద పెద్ద కాంట్రాక్టులు కట్టబెడుతున్నారన్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications