చలో అసెంబ్లీ టెన్షన్: ముందస్తు అరెస్టులు, రాత్రిపూట ఓయులో సోదాలు
హైదరాబాద్: వరంగల్ జిల్లా ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమంపై ఉత్కంఠ నెలకొంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రిపూట ఓయు హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించారు. వరంగల్ ఎదురుకాల్పులకు నిరసనగా ప్రజా సంఘాల నాయకులు, వామపక్షాల నేతలు బుధవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి.
ఓయు హాస్టళ్లలో, నిజాం కళాశాల హాస్టల్లో మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించి 200 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు ప్రజా సంఘాల నాయకులకు పోలీసులు గృహనిర్బంధం విధించారు ప్రజా సంఘాల నేతలను కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్కు వచ్చే రహదారులపై చెక్ పోస్టులు పెట్టారు. అసెంబ్లీకి వెళ్లే అన్ని దారుల వద్ద ఆంక్షలు విధించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద గట్టి నిఘా పెట్టారు. వామపక్ష నేతలను వరంగల్లో అరెస్టు చేశారు.
మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను పోలీసులు గృహనిర్బంధం చేశారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. పోలీసు నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని, ప్రజా ఉద్యమాలతోనే తెలంగాణ ఏర్పడిందని, ఉద్యమాలను అణచాలని చూస్తే ప్రజలు తిరగబడుతారని చుక్కా రామయ్య అన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications