ప్రత్యేక ఆహ్వానంతో పవన్ కళ్యాణ్ రాక: బాబు-కేసీఆర్లు హాజరు
రాజ్ భవన్లో మంగళవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్లు హాజరయ్యారు.
హైదరాబాద్: రాజ్ భవన్లో మంగళవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్లు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ విందుకు హాజరు కావాలని పవన్ కళ్యాణ్కు గవర్నర్ నరసింహన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు రాజ్ భవన్లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిని గవర్నర్ నరసింహన్ దంపతులు ఘన స్వాగతం పలికారు. ఈ విందుకు చంద్రబాబు, కేసీఆర్, కేంద్రమంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, టిఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, డి శ్రీనివాస్, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, తెలంగాణ మంత్రులు సీఎం కడియం శ్రీహరి, నాయిని నర్సింహా రెడ్డి, కేటీఆర్,లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, బిజెపి నేతలు కిషన్రెడ్డి, లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎస్ రాజీవ్ శర్మతదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications