తెలంగాణలో ఎలా గెలవాలో చర్చిద్దాం విజయవాడకు రండి!: బాబు
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే అంశంపై చర్చించేందుకు విజయవాడ రావాలని తెలంగాణ టిడిపి నేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
విశాఖ/హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే అంశంపై చర్చించేందుకు విజయవాడ రావాలని తెలంగాణ టిడిపి నేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
ఆదిలాబాద్కి చెందిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీని వీడి సోమవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, సిర్పూర్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన నాయకులు బాబును కలిశారు.

అందుకే కేసీఆర్ ఫిరాయింపులకు తెరలేపారు
క్షేత్రస్థాయిలో కార్యకర్తలు టిడిపిపై పూర్తి విశ్వాసంతో ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ ప్రాంత మహానాడు విజయవంతమైన క్రమంలోనే టిఆర్ఎస్ ఫిరాయింపులకు తెర తీసిందని బాబుకు చెప్పారు.

రమేష్ రాథోడ్ మినహా ఎవరూ వెళ్లట్లేదు
రమేష్ రాథోడ్ మినహా మాజీ ప్రజాప్రతినిధులు ఎవరూ వెళ్లడం లేదని వారు చంద్రబాబుకు తెలిపారు. ఈ క్రమంలో విజయవాడ వచ్చి తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా, అక్కడ ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం, పార్టీ బలోపేతంపైనా చర్చించుదామని చంద్రబాబు వారికి తెలిపారు.

తెలంగాణ నుంచి చాలామంది
విశాఖ మహానాడుకి తెలంగాణ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు, బస్సులతోపాటు ప్రయివేటు వాహనాల్లో భారీగా నాయకులు, కార్యకర్తలు వచ్చారని ఈ సందర్భంగా తెలంగాణ నాయకులు చంద్రబాబుకు తెలిపారు.

తెలంగాణలో పోటీ చేస్తారా
కాగా, రమేష్ రాథోడ్ చేరిక సందర్భంగా కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబులాంటి వారికి తెలంగాణలో స్థానం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండాప్రజలను మోసం చేశారనీ, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తారని ప్రశ్నించారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చేతులెత్తేశారన్నారు. ఇప్పుడు సిగ్గులేకుండా తెలంగాణలోనూ పోటీ చేస్తానని చెబుతున్నారన్నారు.
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications