ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం, పోలీసులు: లాఠీఛార్జీ, కొంత అపహరణ(పిక్చర్స్)
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి చేతిలో ఒదిగి నవరాత్రులు ప్రత్యేక పూజలందుకున్న లడ్డూ పంపిణీలో గందరగోళం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం 4 గంటలకే భారీఎత్తున భక్తులు ఖైరతాబాద్ చేరుకొని మహాగణపతి లడ్డూకోసం క్యూ కట్టారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి పంపిణీ ప్రారంభించారు. ప్రారంభించిన రెండు గంటల సేపు ప్రశాంతంగా కొనసాగిన పంపిణీలో 10 గంటల తరువాత ఒక్కసారిగా గందరగోళం చోటుచేసుకుంది. భారీఎత్తున గుమిగూడిన భక్తులు బారికేడ్లను దాటుకొని ప్రసాదం కోసం ఎగబడటంతో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు పడిపోయాయి. దీంతో తీవ్ర తోపులాట చోటుచేసుకొని భక్తులు గాయపడ్డారు.

ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం
ఖైరతాబాద్ మహాగణపతి చేతిలో ఒదిగి నవరాత్రులు ప్రత్యేక పూజలందుకున్న లడ్డూ పంపిణీలో గందరగోళం చోటుచేసుకుంది.

ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం
శుక్రవారం ఉదయం 4 గంటలకే భారీఎత్తున భక్తులు ఖైరతాబాద్ చేరుకొని మహాగణపతి లడ్డూకోసం క్యూ కట్టారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి.

ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి పంపిణీ ప్రారంభించారు.

ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం
ప్రారంభించిన రెండు గంటల సేపు ప్రశాంతంగా కొనసాగిన పంపిణీలో 10 గంటల తరువాత ఒక్కసారిగా గందరగోళం చోటుచేసుకుంది.

ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం
భారీఎత్తున గుమిగూడిన భక్తులు బారికేడ్లను దాటుకొని ప్రసాదం కోసం ఎగబడటంతో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు పడిపోయాయి. దీంతో తీవ్ర తోపులాట చోటుచేసుకొని భక్తులు గాయపడ్డారు.

ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం
ప్రసాదాన్ని తీసుకునేందుకు ఎవరికి వారు తామంటే తాము అంటూ ముందుకు రావడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.

ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం
భక్తులు ఒకవైపు, స్థానిక నాయకులు మరో వైపు తమకంటే తమకు ప్రసాదమని పోటీ పడటంతో పోలీసులు ప్రసాద పంపిణీని నిలిపివేశారు.

ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం
అనంతరం ప్రత్యేక వాహనంలో లడ్డూ ప్రసాదాన్ని వేరొక చోట భద్రపరిచేందుకు పంపించారు. అక్కడ కూడా కొందరు ప్రసాదాన్ని లాక్కొని వెళ్లిపోయారు.

ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం
ఇదిలాఉండగా లడ్డూ దాత, తాపేశ్వరానికి చెందిన మల్లిబాబు 1200 కేజీల లడ్డూ ప్రసాదాన్ని తీసుకువెళుతుండగా అడ్డుకొని అందులో నుంచి 200 కేజీల లడ్డూను అపహరించారు.

ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం
ఉదయం నుంచి క్యూలో నిలబడ్డ భక్తులు ప్రసాదం అందకపోయేసరికి తీవ్ర అసంతృప్తి క్తం చేశారు.

ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం
లాఠీఛార్జీ చేయడంతో ఓ భక్తునికి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రి తరలించారు పోలీసులు.

ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం
ఖైరతాబాద్ ప్రసాద పంపిణీ వద్ద తీవ్ర స్థాయిలో తోపులాట జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న డిసిపి కమలహాసన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని భక్తులను శాంతింపచేశారు.

ఖైరతాబాద్ లడ్డూ కోసం ఎగబడిన జనం
ప్రసాద వితరణ కార్యక్రమాన్ని సజావుగా జరిగేలా చూశారు.
ప్రసాదాన్ని తీసుకునేందుకు ఎవరికి వారు తామంటే తాము అంటూ ముందుకు రావడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. భక్తులు ఒకవైపు, స్థానిక నాయకులు మరో వైపు తమకంటే తమకు ప్రసాదమని పోటీ పడటంతో పోలీసులు ప్రసాద పంపిణీని నిలిపివేశారు.
ఉదయం నుంచి క్యూలో నిలబడ్డ భక్తులు ప్రసాదం అందకపోయేసరికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాఠీఛార్జీ చేయడంతో ఓ భక్తునికి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రి తరలించారు పోలీసులు. ఖైరతాబాద్ ప్రసాద పంపిణీ వద్ద తీవ్ర స్థాయిలో తోపులాట జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న డిసిపి కమలహాసన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని భక్తులను శాంతింపచేశారు. ప్రసాద వితరణ కార్యక్రమాన్ని సజావుగా జరిగేలా చూశారు.












Click it and Unblock the Notifications