తెలుగు సీఎంల మరో భేటి... షెడ్యుల్‌కు ముందుగానే సమావేశం

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం మరోసారి భేటి కానున్నారు. నీటీ ప్రాజెక్టులతోపాటు నదుల అనుసంధానం , విభజన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఈ సమావేశం షెడ్యుల్ ప్రకారం మంగళవారం సమావేశం జరగాల్సిన ఉండగా, ఒకరోజు ముందుగానే అనగా సోమవారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక భవనమైన ప్రగతిభవన్‌లో కొననసాగనుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ముఖ్యమంత్రి జగన్‌లు సమావేశం కానున్నారు. వీరితోపాటు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, హజరుకానున్నారు. గతంలో భేటి అయిన ముఖ్యమంత్రులు నదుల అనుసంధానంతో పాటు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించారు. నదుల అనుసంధానంతో పాటు ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపకాల లాంటీ అంశాలపై గతంలో చర్చ జరిగింది.

Chief Ministers Of Two Telugu States will be meeting once again tomorrow

ముఖ్యంగా క్రిష్ణ గోదావరి నదులు అనుసంధానంపై ఇరు రాష్ట్రాల మధ్య ప్రాధమిక చర్చలు గతంలోనే జరిగాయి. రేపటి సమావేశంలో తుది చర్చలు జరిగేందుకు అవకాశాలు ఉన్నట్టు సమాచారం.. ప్రాజెక్టుల అనుసంధానం పై ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ సమావేశం ఉపయోగపడనున్నట్టు ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి.. ఏపీ , తెలంగాణలో ఉన్న ప్రతి అంగుళం భూమిని తడిపి ఇరు రాష్ట్రాలను అభివృద్ది పథంలోకి తీసుకురావాలనే ప్రకటనలు ఇద్దరు సీఎంలు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+