విద్యార్ధినిపై ప్రిన్సిపాల్ భర్త లైంగిక వేధింపులు, సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: ప్రభుత్వ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధిని పట్ల ప్రిన్సిపాల్ భర్త అసభ్యంగా ప్రవర్తించడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ ప్రమోదీని విధుల నుండి తప్పిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఘటన హైద్రాబాద్లో చోటు చేసుకొంది.
హైద్రాబాద్ గోపన్పల్లిలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధినిపై పాఠశాల ప్రిన్సిపాల్ ప్రమోదీని భర్త నాగేశ్వర్ రావు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ భర్తపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసు కేసు విషయమై విద్యా శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రమోడీని సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు
ఇదిలా ఉంటే మరో వైపు నిందితుడు నాగేశ్వర్ రావు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడిపై సెక్షన్ 354 ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.