Kanti velugu: ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు ప్రారంభించిన సీఎంలు..
తెలంగాణలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభం అయింది. రెండో విడత కంటి వెలుగును సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు ప్రారంభించారు. ప్రజలకు సీఎం కేసీఆర్, కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, పినరయి విజయన్, భగవంత్ మాన్ డి.రాజా కళ్లద్దాలు అందజేశారు. సీఎం కేసీఆర్ సీపీఐ నేత రాజాలకు స్కీం గురించి వివరించారు. కంటి పరీక్ష చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు.
అంతకు ముందు ఖమ్మం కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కేరళ సీఎం పినరయి విజయన్ కలెక్టరేట్ భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బిల్డింగ్ రిబ్బన్ కట్ చేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ తో పాటు దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, పినరయి విజయన్ సహా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. నిన్న రాత్రే హైదరాబాద్కు విచ్చేసిన ముఖ్యమంత్రులు ఉదయం ప్రగతిభవన్కు చేరుకుని అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు జాతీయ రాజకీయాలు, సంబంధిత అంశాలపై ఈ నేతలు చర్చించారు.













Click it and Unblock the Notifications