CM KCR: మహబూబాబాద్ కలెక్టరేట్ను ప్రారంభించిన కేసీఆర్..
సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవితను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మ్మెల్యేలు శంకర్నాయక్, రాజయ్య, పలువురు ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన మహబూబాబాద్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో చర్చించిన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం వెళ్లనున్నారు.
కేసీఆర్ రాకతో మహబూబాబాద్ ను ముస్తాబు చేశారు. రోడ్ల వెంట మొక్కలు నాటి ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. డివైడర్లు, గోడలకు రంగులు వేశారు. ఆఫీసర్లు రేయింబవళ్లు శ్రమించి పనులు చేయించారు. అదనపు సిబ్బందిని కేటాయించి వీధుల్ని శుభ్రం చేయించారు.