వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయటి నుంచే కేసీఆర్ దైవదర్శనం - యాదాద్రిలో సీఎం పర్యటన, పూజలు - ఆలయ నిర్మాణంపై రివ్యూ

|
Google Oneindia TeluguNews

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పర్యటించారు. ఐదేళ్లుగా సాగుతోన్న ఆలయ అభివృద్ధి పనులు దాదాపు పూర్తికావొస్తుండగా, వాటిని పరిశీలించేందుకు ఆయన ఆదివారం యాదాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే పనులపై అధికారులతో రివ్యూ నిర్వహించారు.

యాదాద్రికి వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలోని లక్ష్మీనారసింహస్వామికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అయితే, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ, ఆలయ ద్వారం బయటి నుంచే కేసీఆర్ దైవదర్శనం చేసుకోవడం గమనార్హం.

ఎన్నికల వేళ బీహార్‌లో రూ.900 కోట్ల ప్రాజెక్టులు -ప్రారంభించిన ప్రధాని మోదీ -సీఎం నితీశ్‌పై ప్రశంసలుఎన్నికల వేళ బీహార్‌లో రూ.900 కోట్ల ప్రాజెక్టులు -ప్రారంభించిన ప్రధాని మోదీ -సీఎం నితీశ్‌పై ప్రశంసలు

CM KCR performs special pooja at Yadadri temple, reviews construction work

స్వామివారి దర్శనం తరువాత సీఎం.. అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి ఆలయం ఈవో గీతారెడ్డ, ప్రధాన శిల్పి ఆనంద్ సాయి సహా ఇతర అధికారులు సీఎంకు అన్నీ వివరించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తోన్న 6లైన్ రింగ్ రోడ్డు, ఘాట్ రోడ్డులో మొక్కల పెంపకం, ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన విగ్రహాలు, ప్రసాదం కాంప్లెక్స్, పుష్కరిణి వద్ద సాగుతోన్న పనుల తీరును అధికారులు సీఎంకు తెలిపారు.

మూత్రంలో నీళ్లు కలిపిన నటి రాగిణి - డ్రగ్స్ కేసులో సీబీఐ, డాక్టర్లకు చుక్కలు - సంజనాతో ఫైటింగ్మూత్రంలో నీళ్లు కలిపిన నటి రాగిణి - డ్రగ్స్ కేసులో సీబీఐ, డాక్టర్లకు చుక్కలు - సంజనాతో ఫైటింగ్

CM KCR performs special pooja at Yadadri temple, reviews construction work

Recommended Video

Telangana New Revenue Act కు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ!

యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి ఆలయం లోపల, వెలుపల జరుగుతోన్న నిర్మాణ పనులకు సంబంధించి సీఎం కేసీఆర్ అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి తదితరులు కూడా ఉన్నారు.

English summary
Telangana Chief Minister KCR visits Yadadri on sunday. he performed special pujas at Yadadri Lakshmi Narasimha Swamy Temple. CM also examines the restoration, construction work of the temple after the pooja. Temple Evo Geeta, other officials explains the work to CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X