నర్సింహస్వామికి కెసిఆర్ పట్టువస్త్రాలు(పిక్చర్స్)
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలోని ఈశ్వరీపురంలో వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలకు గురువారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ ఘన స్వాగతం పలికారు.
తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పించి స్వామి వారి కల్యాణంలో పాల్గొన్నారు. స్వామి వారి సన్నిధిలోని బంగారు మైసమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన స్వాగత మహాముఖద్వారం, కాటేజీలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
గురువారం ఉదయం 11.40 నిమిషాలకు చీర్యాల్కు చేరుకున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12.00 గంటలకు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానం చైర్మన్ లక్ష్మీనారాయణ సిఎం కెసిఆర్ను సన్మానించారు.
కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్, మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, టిఆర్ఎస్ నేత నక్క ప్రభాకర్గౌడ్, తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ విజేందర్ పాల్గొన్నారు.
కెసిఆర్
రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలోని ఈశ్వరీపురంలో వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలకు గురువారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరయ్యారు.
కెసిఆర్
ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ ఘన స్వాగతం పలికారు.
కెసిఆర్
తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పించి స్వామి వారి కల్యాణంలో పాల్గొన్నారు.
కెసిఆర్
స్వామి వారి సన్నిధిలోని బంగారు మైసమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు.
కెసిఆర్
అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన స్వాగత మహాముఖద్వారం, కాటేజీలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
కెసిఆర్
గురువారం ఉదయం 11.40 నిమిషాలకు చీర్యాల్కు చేరుకున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12.00 గంటలకు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.
కెసిఆర్
ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానం చైర్మన్ లక్ష్మీనారాయణ సిఎం కెసిఆర్ను సన్మానించారు.
కెసిఆర్
కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్, మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.