తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తానని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం విఫలం చెందిన నేపథ్యంలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు, నూతన ఉత్తేజంతో యువ జర్నలిసులను కూడా కలుపుకొని పోయేందుకు కృషి చేస్తున్నట్లు టీయూజెఎస్ కన్వీనర్ ఎంఎం రహమాన్ తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ తమ విజ్ఞప్తికి స్పందించి లోగో ఆవిష్కరించారన్నారు. ఈ సంఘాన్ని అత్యున్నత ప్రాధాన్యతలో గుర్తించాలని, అక్కడికక్కడే సమాచార శాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసినందుకు సీఎంకు రహమాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్రెడ్డి, సీఎంవో చీఫ్ పీఆర్వో అయోధ్యరెడ్డిలకు, సంఘం నేతలు ధన్యావాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సంఘం నేతలు మునీర్, కందుకూరి రమేష్బాబు, యాటకర్ల మల్లేష్, పసూనూరి రవీందర్, తాటికొండ రమేష్బాబు, సాధిక్, ఖాజీపేట నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
-
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications