స్కిల్ డెవలప్మెంట్పై రేవంత్ ఫోకస్ (వీడియో)
Revanth Reddy: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటోన్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై కసరత్తు సాగిస్తోన్నారు. త్వరలోనే దీన్ని ప్రకటించే అవకాశం ఉంది.
పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఆయన దావోస్ పర్యటనకు శ్రీకారం చుట్టారు. స్విట్జర్లాండ్లోని ఈ సిటీలో ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో ఆయన వెంట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు ఉన్నారు.

తన దావోస్ పర్యటనలో భాగంగా తొలి రోజు రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బిజీగా గడిపారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) చీఫ్ దేబ్జనీ ఘోష్, ఇతర ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడంపై వారితో చర్చించారు.
సాఫ్ట్వేర్, హార్డ్వేర్.. సహా వివిధ రంగాల్లో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా యువతకు నైపుణ్యాభివృద్ధిలో నాణ్యమైన శిక్షణ ఇప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనికోసం తమ రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాలని నాస్కామ్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
Chief Minister Sri @Revanth_Anumala on Monday met with @nasscom President Ms. @debjani_ghosh_ at #Davos2024.
— Telangana CMO (@TelanganaCMO) January 15, 2024
The two, along with @Min_SridharBabu and officials of #Telangana delegation, have discussed the way forward for renewed focus on skill development in the State.… pic.twitter.com/INfqcL6Lmj
ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులను చదివే విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. వాటిని ఏర్పాటు చేయడానికి అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
అంతకుముందు రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు.. దావోస్ ఆర్థిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించారు. వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వారికి వివరించారు. శ్రీధర్ బాబు, ఇతర అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications