Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2029 ఎన్నికల్లో ఇవే ఫలితాలు రిపీట్.. కేసీఆర్ వల్ల లాభం లేదనే ఈ తీర్పు!

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడు దశల గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2029 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది: సీఎం రేవంత్
పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామపంచాయతీలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అన్నారు. మొత్తం 12,702 పంచాయతీలకు కాంగ్రెస్ 7,527 చోట్ల, కాంగ్రెస్ రెబల్స్ 808 చోట్ల గెలిచారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ రెబల్స్ కలిపి 8,335 పంచాయతీలు అంటే 66% ఫలితాలను సాధించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy Slams Opposition made 2029 election results repeat like panchayat elections

పాలన చేపట్టి రెండేళ్ళయినా ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించారు
బీఆర్ఎస్, బిజెపి ఒక కూటమిగా ఈ ఎన్నికలలో పోటీ చేసి 3511 బీఆర్ఎస్ స్థానాలను, 710 బిజెపి స్థానాలను దక్కించుకున్నాయన్నారు. ఈ కూటమి మొత్తం 4221 స్థానాలను దక్కించుకుందని. మిగిలిన 146 గ్రామ పంచాయతీలలో సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు గెలిచాయి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని సీఎం పేర్కొన్నారు.

మూసీలో కాలుష్యం కంటే ఒకాయన మాటల్లో విషం ఎక్కువ
పంచాయతీ ఎన్నికలు తమ పాలనకు ప్రజలు ఇచ్చిన రెఫరండం అని, 94 శాసనసభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగితే 87 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారికి ఇంకా అహంకారం తగ్గలేదని పేర్కొన్న రేవంత్ రెడ్డి కెసిఆర్ ను టార్గెట్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీలో కాలుష్యం కంటే ఒకాయన మాటల్లో విషం ఎక్కువ అంటూ విమర్శించారు.

కేసీఆర్ వల్ల లాభం లేదనే ప్రజల తీర్పు
బరితెగించి ఇబ్బంది పెడతామంటే కుదరదని స్పష్టం చేశారు. 2029లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అహంకారం, అసూయ తగ్గించుకోండి అంటూ టార్గెట్ చేశారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని గజ్వేల్ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. గజ్వేల్‌లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలిచిందని, కేసీఆర్ వల్ల లాభం లేదని గజ్వేల్ ప్రజలు మాకు తీర్పు ఇచ్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+