హార్వర్డ్ యూనివర్సిటీలో సీఎం రేవంత్.. లీడర్ షిప్ కోర్సు స్పెషల్ క్లాసులకు హాజరు
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ కోర్సు క్లాసులకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తొలిరోజు 21వ శతాబ్ధంలో నాయకత్వంపై కోర్సులో భాగంగా అధికారిక విశ్లేషణ- నాయకత్వం అంశంపై తొలి సెషన్ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారి క్లాసులు విన్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి.
అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనెడీ స్కూల్ లో (కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తొలి రోజు పరిచయ కార్యక్రమాలతో పాటు 21వ శతాబ్దంలో నాయకత్వం కోర్సులో భాగంగా "అధికార విశ్లేషణ.. నాయకత్వం" అంశంపై తొలి సెషన్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి.
ఇందులో కేస్ అనాలిసిస్, వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమాల్లో సభ్యులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. ఇక దావోస్ లో మూడు రోజుల పర్యటన పూర్తిచేసుకున్న తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ కోర్సుకోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. జనవరి 30 వరకు అమెరికాలో సీఎం పర్యటన కొనసాగనుంది. ఇక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ కోర్సు చేస్తున్న తొలి సీఎంగా అరుదైన ఘనత దక్కించుకోనున్నారు.

మరోవైపు బోస్టన్ ప్రాంతమంతా తీవ్ర శీతాకాల అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. భారీ మంచు తుఫాను (ఫెర్న్) కారణంగా రెండు అడుగులకుపైగా (సుమారు 24 ఇంచులు) మంచు కురిసినట్లు సమాచారం. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ కు దిగువకు పడిపోయాయి.












Click it and Unblock the Notifications