"శ్రీనివాస్ హత్య సూత్రధారి టిఆర్ఎస్ ఎమ్మెల్యే వీరేశం"
Recommended Video

నల్లగొండ: నల్లగొండ చైర్పర్సన్ భర్త, కాంగ్రెసు నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్యెల్యే వీరేశంను కాంగ్రెసు నాయకులు నిందిస్తున్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెసు నేతలు పరామర్శించారు.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత కె. జానారెడ్డి, ఇతర నాయకులు షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బూడిద బిక్షమయ్య శ్రీనివాస్ భార్య, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మిని ఓదార్చారు.

హత్యకు సూత్రధారి వీరేశం
శ్రీనివాస్ దారుణ హత్యకు ఖండిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అది ప్రభుత్వ హత్య అని ఆయన ఆరోపించారు. శ్రీనివాస్ హత్యకు సూత్రధారి నకిరేకల్ శాసనసభ్యుడు వీరేశం అని ఆయన ఆరోపించారు.

సిఎంకు విన్నవించుకున్నా..
ప్రాణభయం ఉందని శ్రీనివాస్ దంపతులు గతంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్కు విన్నవించుకున్నారని ఆయన చెప్పారు. హత్య జరిగి 48 గంటలు గడిచినప్పటికీ పోలీసులు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. నేర చరిత్ర ఉన్న తెరాస నాయకులను కేసీఆర్ వెనకేసుకొస్తున్నారని ఆయన విమర్శించరు.

కాంగ్రెసు పార్టీని దెబ్బ తీసేందుకే..
బలంగా ఉన్న కాంగ్రెసు పార్టీని దెబ్బ కొట్టేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని జానా రెడ్డి ఆరోపించారు. పోలీసులు శ్రీనివాస్ కాల్ డేటాను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తోందని ఆయన మండిపడ్డారు.

సిబిసిఐడి విచారణ జరిపించాలని డిమాండ్
శ్రీనివాస్ హత్య కేసును సిబిసిఐడికి ప్పగిస్త వాస్తవాలు బయటకు వస్తాయని జానా రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెసు పార్టీ అండా ఉంటుందని ఆయన చెప్పారు.

హత్యలో వీరేశం హస్తం
శ్రీనివాస్ హత్యలో ఎమ్మెల్యే వేముల వీరేశం హస్తం ఉందని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. నయీంలా వీరేశంను ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదని ఆయన అడిగారు. కెసీఆర్ పతనం నల్లగొండ నుంచే ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. డిఎస్పీ సుధాకర్ను విధుల నుంచి తప్పించాలని మరో కాంగ్రెసు నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కాంగ్రెసు కార్యకర్తలు అధైర్యపడవద్దని ఆయన సూచించారు.

అక్కడున్నట్లు సమాచారం
శ్రీనివాస్ హత్య విషయంలో ఎమ్మెల్యే వీరేశంపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ను హత్య చేసినవారు ఊట్కూరులో ఉన్నట్లు సమాచారం ఉందని ఆయన అన్నారు. శ్రీనివాస్కు నాలుగేళ్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆన అన్నారు. రక్షణ కోసం సిఎంను, ఐజిని కలిశామని, అయినా రక్షణ కల్పించలేదని ఆయన చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications