వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నేతను వేట కొడవళ్లతో నరికి చంపారు, పాత పగలే కారణమా?

కాంగ్రెస్‌ పార్టీ నేత పట్టపగలే దారుణహత్యకు గురయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.

|
Google Oneindia TeluguNews

భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్‌ పార్టీ నేత పట్టపగలే దారుణహత్యకు గురయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.

అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో గ్రామానికి చెందిన వేముల శ్రీనివాసరావు మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం గ్రామంలోని హోటల్‌కు టిఫిన్‌ చేసేందుకు వచ్చారు.

Congress leader Srinivas Rao killed by unknown people

అదే సమయంలో అక్కడకు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనివాసరావుపై తమ వెంట తెచ్చుకున్న పెప్పర్‌ స్ప్రే కొట్టారు. దీంతో అప్రమత్తమైన శ్రీనివాసరావు అక్కడి నుంచి పరుగులు తీస్తుండగా దుండగులు వెంటాడి వేట కొడవళ్లతో దారుణంగా నరికి హత్య చేశారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. గతంలో శ్రీనివాసరావుపై హత్యాప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
Congress leader Srinivas Rao killed by unknown people in Bhdradri kothagudesm district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X