వారికో న్యాయం కోదండరామ్కో న్యాయమా?: వి.హనుమంతరావు
హైదరాబాద్: డబ్బుల సంపాదించేందుకు సినిమాల వారికి స్టేడియాల్లో కార్యక్రమాల నిర్వహణకు అనుమతి ఇస్తున్నప్పుడు తెలంగాణ సాధన పోరాటంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ జెఎసీ ఛైర్మెన్ కోదండరామ్ పార్టీ సభకు ఎందుకు అనుమతి ఇవ్వరని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు.
మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్ పాలనలో అన్యాయానికి గురయ్యారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. . తెలంగాణకు దళితుడినే సీఎంను చేస్తానని ఇచ్చిన హమీని కెసిఆర్ తుంగలో తొక్కారని ఆయన విమర్శలు గుప్పించారు.

తెలంగాణ సాధనలో భాగస్వామ్యులుగా ఉన్నవారిని కెసిఆర్ దూరం పెట్టారని ఆయన చెప్పారు. తెలంగాణ సాధనలో ప్రోఫెసర్ కోదండరామ్ పాత్రను ఎవరూ కూడ మరువలేరని ఆయన చెప్పారు. కోదండరామ్ ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి సభ ఆవిర్భావ సభకు ఎందుకు అనుమతివ్వరని ఆయన ప్రశ్నించారు.
డబ్బుల కోసం సినిమాలకు చెందిన కార్యక్రమాలకు స్టేడియాలను ఇస్తున్నారని, అలాంటిది కోదండరామ్ సభకు ఎందుకు అనుమతివ్వరని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ పాలన అంతిమ దశకు చేరుకొందని హనుమంతరావు చెప్పారు. రాష్ట్రంలో ఎవరికీ అన్యాయం జరిగినా తనకు ప్రశ్నించే హక్కుందన్నారు. కోదండరామ్ ఏర్పాటు చేసే సభకు ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications