వేల వాట్సప్ గ్రూపులలో డేంజరస్ ఏపీకే ఫైల్స్.. మీ వాట్సప్ సేఫేనా?
సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు అలజడి సృష్టిస్తున్నారు. ముఖ్యంగా whatsapp గ్రూప్ లను టార్గెట్ చేసి ఏపీకే ఫైల్స్ ను పంపిస్తున్నారు. పొరపాటున ఆ ఫైల్ ఓపెన్ చేస్తే అంతే సంగతి.. మీ మొబైల్ లోకి చొరబడి మీ వ్యక్తిగత ఖాతాను తమ అధీనంలోకి తీసుకుని బ్యాంకు ఖాతాలను చోరీ చేస్తున్నారు.
వాట్సప్ గ్రూపులలో అలజడి రేపుతున్న ఏపీకే ఫైల్స్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చిన్న పెద్ద తేడా లేకుండా అనేక whatsapp గ్రూప్ లలో ఏపీకే ఫైల్స్ వైరల్ గా మారాయి. ఆధార్ తో సహా ఇతర ఈకేవైసీ వివరాలు అప్డేట్ చేయని కారణంగా మీ బ్యాంకుఖాతా ఈరోజు రాత్రినుండి బ్లాక్ చేయబడుతుందని, దయచేసి క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వివరాలను అప్లోడ్ చేయాలని టీం ఎస్బిఐ పేరుతో వాట్సాప్ గ్రూపులలో ఏపీకే ఫైల్స్ చెక్కర్లు కొట్టాయి.

మంత్రులు, మీడియా గ్రూపులలోనూ హల్చల్ చేసిన ఏపీకే ఫైల్స్
ఎస్బిఐ ఖాతాదారులు చాలామంది ఆ లింకును క్లిక్ చేశారు అంతే ఆ క్షణం నుంచి వారి ఫోన్లు సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్ళాయి. ఇక వారి whatsapp గ్రూపుల నుండి ఇతర whatsapp గ్రూప్ లకు ఏపీకే ఫైల్స్ వ్యాపించాయి ఇలా వేలాది ఫోన్స్ కు ఏపీకే ఫైల్స్ చేరడం, తెలంగాణ రాష్ట్ర మంత్రిత్వ శాఖ అధికారులు, మీడియా ప్రతినిధులు ఉన్న గ్రూపులలో కూడా హల్చల్ చేయడం కనిపించింది.
ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసిన వారికి తెలంగాణ పోలీసులు అలర్ట్
ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసిన వారికి తెలంగాణ పోలీసులు అలర్ట్ ఇస్తున్నారు. పొరపాటున ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసి ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మొదటి ఇంటర్నెట్ డేటాను ఆఫ్ చేసి సెట్టింగ్స్ లో ఉన్న యాప్స్ లోకి వెళ్లి ఆ ఏపీకే యాప్ ను అన్ఇన్స్టాల్ చేయాలని ఆపైన యాంటీవైరస్ యాప్ తో ఫోన్ ను ఫుల్ స్కాన్ చేయాలని చెబుతున్నారు.
మాల్వేర్ యాప్ అన్ఇన్స్టాల్ కాకపోతే ఇలా చెయ్యాలి
అంతేకాదు బ్యాంకింగ్ యాప్ లు, సామాజిక మధ్యమ ఖాతాలు, ఇమెయిల్ ఖాతాలో పాస్వర్డ్ లను కూడా తక్షణమే మార్చాలని ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నాయేమో పరిశీలించాలని సూచిస్తున్నారు. ఒకవేళ మాల్వేర్ యాప్ అన్ఇన్స్టాల్ కాకపోతే మొబైల్ ను సేఫ్ మోడల్ రీస్టార్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయాలని చెబుతున్నారు.
డేటా బ్యాకప్.. ఫ్యాక్టరీ రీ సెట్ చేసుకుంటే సేఫ్
ఫోన్లో ఇంకా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే డేటా బ్యాకప్ తీసుకుని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఉత్తమమని, ఏదైనా మోసపోయినట్టు గ్రహిస్తే వెంటనే బ్యాంకు ఖాతాను స్తంభింప చేయాలని చెబుతున్నారు. 1930 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కూడా సూచిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications