ఇండోర్ నుంచి తల్లిదండ్రుల కోసం..: బాసరలో ‘డాటర్ ఆఫ్ ఇండియా’ గీత
ఆదిలాబాద్: బాల్యంలో తప్పిపోయి పాకిస్థాన్లో చిక్కుపోయి.. అప్పటి విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ చొరవతో స్వదేశమైన భారత్కు తిరిగి వచ్చిన గీత ఇప్పుడు తెలంగాణలోని బాసర పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. సుష్మా స్వరాజ్ ఆమెను డాటర్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్న విషయం తెలిసిందే.
మంగళవారం బాసరకు వచ్చిన గీత ఆలయాలను సందర్శించారు. తన కుటుంబసభ్యులను వెతికే క్రమంలోనే ఆమె ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం ఆమెకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్ మధ్యప్రదేశ్ వారు చూసుకుంటున్నారు. వారి సహకారంతోనే ఆమె బాసరకు వచ్చారు.

కాగా, దాదాపు 20ఏళ్ల క్రితం తప్పిపోయిన గీత.. పాకిస్థాన్ చేరుకుంది. అక్కడి ఈద్ ఫౌండేషన్లో 15 సంవత్సరాలు ఉంది. సుష్మా స్వరాజ్ సహకారంతో ఐదేళ్ల (అక్టోబర్ 23, 2015) క్రితం ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్లో ఉంటున్నారు.

తన చిన్న తనంలో తమ వారు ఇడ్లీలు తినేవారని, ధాన్యం ఎక్కువగా పండించేవారని సైగలతో గీత వివరించింది. ఆమె చెప్పిన ఆనవాళ్ల ప్రకారం.. గీత తల్లిదండ్రుల కోసం వెదుతుకున్నారు. ఆమె తల్లిదండ్రులు తెలంగాణ లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారై ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆమె తల్లిదండ్రుల ఆచూకీ మాత్రం లభించలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications