నాగుల పంచమి రోజున... బాసర సరస్వతి ఆలయంలో కొండ చిలువ కలకలం...
నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో శనివారం(జూలై 25) కొండచిలువ కలకలం సృష్టించింది. ఆలయంలో గల అక్షరాభ్యాస మంటపం ప్రధాన ద్వారం వద్ద పాము కనిపించడంతో కొంతమంది భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇవాళ శ్రావణ మొదటి శనివారం,నాగుల పంచమి కావడంతో ఆలయంలోకి పాము రాకను శుభ సూచకమని పండితులు చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు కొండ చిలువకు పాలు పోసి పూజలు చేసినట్లు సమాచారం. అయితే ఆలయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.... అధికారులు పామును బంధించి అక్కడినుంచి తీసుకెళ్లారు.

ఆదిలాబాద్ జిల్లాలోనూ నాగుల పంచమి రోజున ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. అర్లిబి గ్రామంలోని ఓ చెక్ డ్యామ్ వద్ద రెండు నాగుపాములు సయ్యాటలాడుతూ కనిపించాయి. స్థానికులు వాటిని సెల్ఫోన్లో చిత్రీకరించడంతో... అది కాస్త వైరల్గా మారింది. నాగుపాముల సయ్యాట గురించి తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని తిలకించారు. నాగుల పంచమి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
ప్రతీ ఏటా ఆదిలాబాద్లోని కేస్లాపూర్లో ఉన్న నాగోబా ఆలయంలో నాగుల పంచమిని ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వేడుకలను రద్దు చేస్తూ మెస్రం వంశీయులు నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
కాగా,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్లలో నాగుల పంచమిని చాలామంది భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు.ఉదయం నుంచే చాలా ఆలయాల్లో భక్తుల పూజలు మొదలయ్యాయి. నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేసి,పుట్టలో పాలు పోస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని కొంతమంది భక్తులు పూజలు చేయడం గమనార్హం.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications