కేసిఆర్ను నమ్మొద్దు, సోనియానే మోసం చేశారు: దీదీతో విహెచ్
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావును విశ్వసించకూడదని కాంగ్రెసు నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చెప్పారు. ఢిల్లీలో ఆయన మమతా బెనర్జీని కలిశారు. కేసిఆర్ విశ్వసించదగినవాడు కాదని ఆయన మమతతో చెప్పారు.
తనను నమ్మినవారిని మోసం చేసే గుణం కేసిఆర్కు ఉందని ఆన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెసులో విలీనం చేస్తానని హామీ ఇచ్చారని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియా గాంధీని మోసం చేశారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ను పక్కన పెట్టారని, కేసిఆర్తో పాటు కోదండరామ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటం చేశారని ఆయన చెప్పారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ప్రకటన వెనక కేసిఆర్కు రెండు లక్ష్యాలు ఉన్నాయని, మోదీ వ్యతిరేక.. బిజెపి వ్యతిరేక ఓటును చీల్చలడం ద్వారా బిజెపి ఉపయోగపడడం ఒకటి కాగా, కెటిఆర్ను ముఖ్యమంత్రిని చేయడం రెండోదని తాను మమతా బెనర్జీకి చెప్పినట్లు విహెచ్ తెలిపారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications