డబుల్ ఆర్ ట్యాక్స్ వసూళ్లు: మోడీకి కేసీఆర్ సవాల్
కొత్తగూడెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కొత్తగూడెంలో జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. మహబూబాబాద్ లోక్సభ నుంచి మాలోతు కవితను, ఖమ్మం లోక్సభ నుంచి నామ నాగేశ్వరరావును గెలిపించాలని కేసీఆర్ కోరారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తోందని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ.. మరి ఎందుకు ఈడీ, ఐటీలతో విచారణ జరిపించడం లేదని నిలదీశారు. వెంటనే ఈ విషయంపై ఈడీ, ఐటీ సంస్థలను మోడీ రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు కేసీఆర్.

బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేశామని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని వ్యాఖ్యానించారు. వీరిద్దరిలో ఎవరికి ఓటేసిన గోదావరిలో వేసినట్లు తప్పా రాష్ట్రానికి ఏం లాభం లేదన్నారు. కొత్తగూడెంలోనే ఎక్కువగా పోడు పట్టాలను అందించామని తెలిపారు. అలాగే రైతుబంధు, రైతుబీమాలను కల్పించామన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబంధు ఎవరికైనా వచ్చిందా? అని ప్రశ్నించారు.
కొత్తగూడెం రోడ్ షోలో పోటెత్తిన జనం.. పోరాట సింహానికి జన'నీరాజనం'.
— BRS Party (@BRSparty) April 30, 2024
భారీ జనసందోహం మధ్య సాగుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరుబాట.. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ సీట్లలో ఎగిరేది గులాబీ జెండానే.
ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ అభ్యర్థి మాలోత్ కవిత గారికి… pic.twitter.com/p59a6pxJex
తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు కేసీఆర్. ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకు దక్కుతాయన్నారు. కాంగ్రెస్ కథ ముగిసిపోయిందని, బీజేపీ కథ కూడా కంచెకే అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ ఓటర్లను కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ 12 సీట్లను గెలవబోతోందన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications