తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్: రాజ్యాంగంపై మోడీ సంచలన వ్యాఖ్యలు
జహీరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జహీరాబాద్లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ట్రిపుల్ ఆర్ లాంటి సూపర్ హిట్ సినిమా ఇస్తే.. తెలంగాణకు కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
#WATCH | Telangana: Addressing a public rally in Zahirabad, PM Narendra Modi says, "Telugu film industry gave superhit film like RRR to India. But today, Telangana Congress has given the people of the state an RR tax. RRR made India famous in the world, but the RR tax is proving… pic.twitter.com/OzY68Zy5RD
— ANI (@ANI) April 30, 2024
డబుల్ ఆర్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోంది. వ్యాపారవేత్తలు డబుల్ ఆర్ ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. డబుల్ ట్యాక్సుతో ప్రజలు విసిగిపోయారు. డబుల్ ఆర్ ట్యాక్సు సొమ్ము ఢిల్లీకి వెళుతోంది. డబుల్ ఆర్ ట్యాక్సుకు షాక్ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో మరింత పతనమవుతుంది. ఈ డబుల్ ఆర్ ట్యాక్సుపై విస్తృత చర్చ నడుస్తోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులని మోడీ విమర్శించారు. ప్రజలు భవిష్యత్ కోసం దాచిన సొమ్మును దోచేసే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రజల సొమ్ముకు రక్షణ ఉండదని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే వారసత్వ పన్ను విధించబోతోందన్నారు. ప్రజల ఆస్తుల్లో 50 శాతం లూటీ చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు ప్రధాని మోడీ.
Congress and BRS are both members of the same corruption racket.
— BJP (@BJP4India) April 30, 2024
The extent of this racket is evident in incidents like Delhi's Liquor Scam.
- PM Shri @narendramodi
Watch full video: https://t.co/sGih7BsvTP pic.twitter.com/P6yQUeoPal
అవినీతి రాకెట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్లు భాగస్వాములని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో భారీ కుంభకోణానికి పాల్పడిందన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నప్పటికీ బీఆర్ఎస్ తొక్కిపెట్టిందని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం స్కాంను తొక్కిపెడుతోందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి దోస్తీ బయటపడిందని విమర్శించారు.
నేను బ్రతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడతా: మోడీ
కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం అంటే ఎప్పుడూ గౌరవం లేదని మండిపడ్డారు ప్రధాని మోడీ. మొదటి రోజు నుంచీ రాజ్యాంగం, అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందని ధ్వజమెత్తారు. మొదట రాజ్యాంగంలో రామాయణ, మహాభారత చిత్రాలు ఉండేవని.. వాటిని కాంగ్రెస్ తొలగించిందని గుర్తు చేశారు.
#WATCH | Telangana: Addressing a public rally in Zahirabad, PM Narendra Modi says, "They are trying to fool the country in the name of the Constitution. The first constitutional amendment was made by the first Prime Minister which was to curtail free speech. They once again tried… pic.twitter.com/GUNVdDhev5
— ANI (@ANI) April 30, 2024
అధికార దాహంతో నెహ్రూ, ఇందిర రాజ్యాంగాన్ని పదే పదే అవమానించారని మండిపడ్డారు. ఎమర్జెన్సీని విధించి ప్రజల హక్కులను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని పేద ప్రజల కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేయలేదన్నారు. లంబాడి సమాజానికి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టాలని కుట్ర చేస్తోందని మోడీ అన్నారు. నరేంద్ర మోడీ బ్రతికున్నంత వరకు రాజ్యాంగం రద్దు కాదని, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత తనదేనని ప్రధాని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లను కాపాడతామని అన్నారు. ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుంటానని స్పష్టం చేశారు.
ఫేక్ వీడియోలపై ప్రధాని మోడీ ఆగ్రహం
మరోవైపు, రిజర్వేషన్లపై తమ నేతలపై ఫేక్ వీడియోలు చేసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు ప్రధాని మోడీ. ఇదంతా డబుల్ ఆర్ పనేనంటూ పరోక్షంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఫేక్ వీడియోలు చేసినవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
-
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications