పెరిగిన వాహనాలు: ఓలా కార్యాలయంపై డ్రైవర్ల దాడి, బౌన్సర్లను చితకబాదారు
భాగ్యనగరంలోని కూకట్పల్లి ఓలా సర్వీస్ కార్యాలయం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం పైన పలువురు డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్: భాగ్యనగరంలోని కూకట్పల్లి ఓలా సర్వీస్ కార్యాలయం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం పైన పలువురు డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు. ఓలా క్యాబ్లు పెరగడం వల్ల ఆదాయం పడిపోయిందని వారు ఆందోళన చేపట్టారు.
డ్రైవర్లు ఓలా కార్యాలయం అద్దాలు పగలగొట్టి, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఓలా కార్యాలయ సిబ్బంది, బౌన్సర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

కాగా, తొలుత డ్రైవర్లు తమ సమస్యలను యాజమాన్యానికి చెప్పుకునేందుకు వెళ్లగా.. బౌన్సర్లు దాడి చేశారని అంటున్నారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్లు.. బౌన్సర్లను చితకబాదారని చెబుతున్నారు.
పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింప చేశారు. డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా వాహనాల సంఖ్య బాగా పెరిగింది.
ఓలా క్యాబ్స్ ఇచ్చిన వాహనాలు సరిగ్గా నడవకపోవడం, అదే విధంగా డ్రైవర్లు డబ్బులు సరిగ్గా చెల్లించక పోవడంతో యాజమాన్యం ఒత్తిడి తీసుకొచ్చిందని అంటున్నారు. ట్రిప్పుల విషయంలో తేడా వచ్చిందని ఓనర్లు చెబుతున్నారు. సుమారు వెయ్యి మంది డ్రైవర్లు కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications