పెరిగిన వాహనాలు: ఓలా కార్యాలయంపై డ్రైవర్ల దాడి, బౌన్సర్లను చితకబాదారు
భాగ్యనగరంలోని కూకట్పల్లి ఓలా సర్వీస్ కార్యాలయం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం పైన పలువురు డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్: భాగ్యనగరంలోని కూకట్పల్లి ఓలా సర్వీస్ కార్యాలయం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం పైన పలువురు డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు. ఓలా క్యాబ్లు పెరగడం వల్ల ఆదాయం పడిపోయిందని వారు ఆందోళన చేపట్టారు.
డ్రైవర్లు ఓలా కార్యాలయం అద్దాలు పగలగొట్టి, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఓలా కార్యాలయ సిబ్బంది, బౌన్సర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

కాగా, తొలుత డ్రైవర్లు తమ సమస్యలను యాజమాన్యానికి చెప్పుకునేందుకు వెళ్లగా.. బౌన్సర్లు దాడి చేశారని అంటున్నారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్లు.. బౌన్సర్లను చితకబాదారని చెబుతున్నారు.
పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింప చేశారు. డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా వాహనాల సంఖ్య బాగా పెరిగింది.
ఓలా క్యాబ్స్ ఇచ్చిన వాహనాలు సరిగ్గా నడవకపోవడం, అదే విధంగా డ్రైవర్లు డబ్బులు సరిగ్గా చెల్లించక పోవడంతో యాజమాన్యం ఒత్తిడి తీసుకొచ్చిందని అంటున్నారు. ట్రిప్పుల విషయంలో తేడా వచ్చిందని ఓనర్లు చెబుతున్నారు. సుమారు వెయ్యి మంది డ్రైవర్లు కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications