హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈజిప్టు COP27 సదస్సులో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాదీ 16 ఏళ్ల అంకిత్ రావు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్-కైరో: హైదరాబాద్ నగరానికి చెందిన 16 ఏళ్లబాలుడు అంకిత్ సుహాస్ రావు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో జరుగుతున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ(కాప్(సీవోపీ)-27).. 27వ సెషన్లో భారతదేశం తరపున అంకిత్ ప్రాతినిథ్యం వహిస్తుండటం విశేషం.

కాప్ 27, నవంబర్ 6 ఆదివారంనాడు ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్‌లో ప్రారంభమైంది. నవంబర్ 18 శుక్రవారం వరకు కొనసాగుతుంది.

బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న అంకిత్ సుహాస్ రావు తోపాటు ఐదుగురు విద్యార్ధులు (ఉత్తర అమెరికా, ఈజిప్ట్, భారతదేశం, ఆఫ్రికా, ఫిలిప్పీన్స్‌ల నుంచి ఒక్కొక్కరు) ఎలైట్ గ్రూప్‌లో భాగమయ్యారు.

COP27 సమ్మిట్‌లో అంకిత్ తన అభ్యాసాలు, పరిశీలనలపై ఒక పత్రాన్ని సమర్పించనున్నారు. వాతావరణ శాస్త్రవేత్త కావాలనుకుంటున్న అంకిత్.. న్యూస్ 18తో మాట్లాడుతూ .. "వాతావరణ మార్పు జరుగుతోందని, ఇది చాలా వేగంగా జరుగుతుందని ప్రజలకు చెప్పడానికి మేము దానిని తీసుకున్నాము' అని చెప్పారు.

Egypt COP27 summit: 16 years old Hyderabadi boy to represent for India in this summit

కాప్ 27లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని అంకిత్ చెప్పాడు. "ఇది గొప్ప, అద్భుతమైన విద్యా అవకాశం. ఇది వాతావరణ సమస్యలకు పరిష్కారాలపై పని చేయడానికి, మెరుగైన, సురక్షితమైన, మరింత స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించడంలో దోహదపడేలా ఇతర విద్యార్థులను కనెక్ట్ చేయడానికి, ప్రభావితం చేయడానికి నాకు విస్తృతమైన అవగాహనను ఇస్తుంది' అని అంకిత్ పేర్కొన్నాడు.

యూఎన్ సమ్మిట్‌కు హాజరైన సంస్థ నుంచి అంకిత్ రావు మొదటి విద్యార్థి కాదు. 2021లో గ్లాస్గోలో జరిగిన COP26లో, 54 దేశాలకు చెందిన విద్యార్థుల తరపున స్టేట్‌మెంట్ ఇవ్వడానికి పవన్ త్రిషు కుమార్ ఎంపికయ్యారు.

అంకిత్.. ఈ అవకాశంలో భాగంగా, యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ యూత్ (COY17)లో కూడా పాల్గొంటాడు. 10-రోజుల కార్యక్రమంలో, అతను ప్రపంచ నాయకులు, ఇతర సారూప్యత కలిగిన వ్యక్తులతో సంభాషించే అవకాశాన్ని పొందాడు.

COP27 గురించి చెప్పాలంటే.. ఐక్యరాజ్యసమితి వాతావరణ సమావేశం COP27, నవంబర్ 18 వరకు కొనసాగుతుంది. ఆదివారం ఈజిప్టు రిసార్ట్ షర్మ్ ఎల్-షేక్‌లో ప్రారంభమైంది.

దాదాపు 200 దేశాలకు చెందిన నాయకులు, ప్రతినిధులను ఒకచోట చేర్చే ఈ సమావేశం కొత్త ప్రపంచ వాతావరణ కాంపాక్ట్ నియమాలను స్పష్టం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తక్షణమే తగ్గించడం, స్థితిస్థాపకతను పెంపొందించడం వంటి అనేక వాతావరణ సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించింది. వాతావరణ మార్పు అనివార్య ప్రభావాలు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఫైనాన్సింగ్ కట్టుబాట్లను నెరవేర్చడం వీటిలో ముఖ్య అంశాలుగా ఉన్నాయి.

English summary
Egypt COP27 summit: 16 years old Hyderabadi boy to represent for India in this summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X