తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనర్హులు వీళ్లే !
తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. రాష్ట్రంలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు.
కాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనవరి 28వ తేదీ (బుధవారం) నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు తమ నామినేషన్లను జనవరి 30వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు దాఖలు చేయవచ్చు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన చేపట్టి, అదే రోజు సాయంత్రం అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. చివరిగా ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది.. ఓటింగ్ పూర్తి అయిన వెంటనే లెక్కింపు ప్రారంభించి తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు.

అభ్యర్థుల అర్హతలు..
ఎన్నికల్లో పోటీ చేసే వారు భారత పౌరులై ఉండాలి.
కనీస వయస్సు 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.
కార్పొరేషన్ అభ్యర్థులు ఆ కార్పొరేషన్ పరిధిలోని ఏదైనా వార్డులో ఓటరుగా నమోదు అయి ఉండాలి.
మున్సిపాలిటీ అభ్యర్థులు సంబంధిత మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా ఉండటం తప్పనిసరి.
అనర్హులు..
ప్రభుత్వ కాంట్రాక్టర్లు, లాభదాయక పదవుల్లో ఉన్న వ్యక్తులు, గత ఎన్నికల్లో వ్యయ వివరాలు సమర్పించని కారణంగా అనర్హతకు గురైన వారు పోటీకి అర్హులు కారు.
కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సేవల నుంచి తొలగించబడిన వారు కూడా ఎన్నికలకు దూరంగా ఉండాలి.
దివాలా ప్రకటించబడిన వ్యక్తులకు పోటీ చేసే హక్కు ఉండదు.
నామినేషన్కు అవసరమైన పత్రాలు..
అభ్యర్థులు ఎన్నికల అధికారి నుంచి పొందిన నామినేషన్ ఫారాన్ని సమర్పించాలి.
ఆస్తులు, అప్పులు, ఆదాయాలు, క్రిమినల్ కేసుల వివరాలతో కూడిన అఫిడవిట్ తప్పనిసరి.
ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు ప్రతులు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేయాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్ స్థానాల్లో పోటీ చేసే వారు రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ ఎమ్మార్వో స్థాయి అధికారి ఎదుట ఇచ్చిన డిక్లరేషన్ను సమర్పించాలి.
రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే వారు బీ-ఫామ్ తీసుకొని రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి.
స్వతంత్ర అభ్యర్థులకు ఆ వార్డులోని 10 మంది ఓటర్ల ప్రతిపాదన తప్పనిసరి.
వ్యయ పరిమితులు & డిపాజిట్ నిబంధనలు..
ఎన్నికల ఖర్చుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు విధించింది.
కార్పొరేషన్ అభ్యర్థులకు గరిష్టంగా రూ.10 లక్షలు, గ్రేడ్-1 మున్సిపాలిటీ అభ్యర్థులకు రూ.5 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అనుమతి ఉంది.
నామినేషన్కు ముందే ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి. ప్రచార ఖర్చులన్నీ అదే ఖాతా ద్వారా జరగాలి.
డిపాజిట్ విషయానికి వస్తే మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1,250, ఇతరులకు రూ.2,500 నిర్ణయించారు.
కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి.
రిజర్వ్ స్థానాల్లో పోటీ చేసే వారు కుల ధృవీకరణ పత్రం జత చేయడం తప్పనిసరి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications