అన్నంలో సున్నం, గొడ్డు చాకిరీ: మైక్రోమ్యాక్స్ ప్లాంట్లో ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్: నగర శివార్లలోని మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఇటీవల ప్రారంభమైన మైక్రోమ్యాక్స్ మొబైల్ ప్లాంట్లోని ఉద్యోగులు సోమవారం ఆందోళనకు దిగారు. తమకు వేతనాలు ఆఫర్ లెటర్లలో ఇచ్చిన విధంగా చెల్లించడం లేదని, తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు.
తమకు పెట్టే భోజనంలో సున్నం కలుపుతున్నారని చెప్పిన ఉద్యోగులు, యాజమాన్యం బలవంతంగా తమతో రోజుకు 10 గంటలు పనిచేయించుకుంటోందని ఆరోపించారు. దీంతో పాటు వచ్చి పోయేటప్పుడు తనిఖీల పేరిట తమను వేధిస్తున్నారని ఆరోపించారు.
తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మైక్రోమ్యాక్స్ మొబైల్ ప్లాంట్లోని ఉద్యోగులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. కాగా, నెల రోజుల కింద ఈ ప్లాంట్ను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
English summary
Employees protest at micromax plant in hyderabad.
Story first published: Monday, May 9, 2016, 17:32 [IST]