హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాంగోపాల్ వర్మ ‘దిశ’ విడుదల చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం: దోషుల ఫ్యామిలీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టించిన దిశ ఘటనను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాను నిలిపివేయాలని కోరుతూ ఆ కేసులో దోషుల కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయ కమిషన్‌ను సోమవారం ఆశ్రయించారు.

దిశ కేసులో కేసులో ఎన్‌కౌంటర్ అయిన దోషులు శివ, నవీన్, చెన్నకేశవులు, ఆరీఫ్ కుటుంబసభ్యులు ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ న్యాయ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రంలో తమ వాళ్లను విలన్లుగా పెట్టి చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

 Encounter Victims Kin Oppose Film On Ram Gopal Varmas Disha

చనిపోయిన వారి ఆత్మ క్షోభించేలా ఈ చిత్రం తీసి తమను ఇంకా చంపుతున్నారని కమిషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు న్యాయ కమిషన్‌లో విచారణ కొనసాగుతుంటే 'దిశ' కథను ఎలా తెరకెక్కిస్తారని ప్రశ్నించారు. స్థానికంగా తాము అనేక అవమానాలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ సినిమా విడుదలైతే తాము ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

కాగా, ఇప్పటికే ఈ సినిమాను ఆపాలని 'దిశ' తండ్రి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కల్పించుకుని ఈ సినిమాను వెంటనే నిషేధించాలని కోరారు. తమను సంప్రదించకుండా రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సరికాదన్నారు. కుమార్తెను కోల్పోయి, ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Even as the Telangana high court has been hearing a petition filed by the family members of the veterinary doctor who was allegedly raped and killed at Shamshabad in November last, the family members of the accused in the rape case, too, moved the court seeking to stall the release of the movie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X