డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ
హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ వెంకట్రామ్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. డెక్కన్ క్రానికల్ ప్రమోటర్ల అరెస్టుపై బుధవారం ఈడీ ప్రకటన విడుదల చేసింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో మనీలాండరింగ్ యాక్టు కింద ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు అయిన వెంకట్రామ్ రెడ్డి, పీకే అయ్యర్, ఆడిటర్ మణి ఊమెన్లను బుధవారం అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
బెంగళూరు, తెలంగాణలో ఈ నిందితులపై సీబీఐ పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందని తెలిపింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి)తోపాటు పలు ఫిర్యాదులు అందాయని పేర్కొంది. 16 బ్యాంకుల నుంచి వ్యాపారం పేరుతో రూ. 9805 కోట్ల రుణాలు తీసుకున్నారని.. అయితే, వాటి వినియోగానికి సంబంధించి ఎలాంటి సరైన పత్రాలు చూపలేదని తెలిపింది. ప్రకటనల పేరుతో ఆదాయం వచ్చిందని బ్యాంకులను మోసగించారని పేర్కొంది.

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను పలు మార్గాల్లో మళ్లించారు. రుణాలు తీర్చేందుకు కొత్త రుణాలు తీసుకున్నారు. బ్యాంకులకు రూ. 8180 కోట్లు నష్టం వాటిల్లేలా చేశారు. తీసుకున్న రుణాలతో ఐపీఎల్లో పెట్టుబడులు పెట్టారు. వెంకట్రామి రెడ్డి ప్రైవేటు విమానం కొనుగోలు చేయగా.. పీకే అయ్యర్ రూ. 30 కోట్లతో లగ్జరీ కార్లు కొనుగోలు చేశారని ఈడీ ప్రకటనలో వెల్లడించింది.
సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే వెంకట్రామిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. గతంలో ఆయనకు సంబంధించిన రూ. 3,300 కోట్లకుపైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications