వార్డు కార్యాలయాల ద్వారా వేగంగా పౌర సేవలు.!నగర పాలక అధికారులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం.!

హైదరాబాద్ : ఒకే రోజు నగరవ్యాప్తంగా 150 డివిజన్ లలో వార్డ్ కార్యాలయాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. వార్డు కార్యాలయం ద్వారా నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందుతాయన్నారు. పౌర సేవలతో పాటు ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిహెచ్ఎంసి అధికార యంత్రాంగానికి వీలు కలుగుతుందని, వార్డు స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నారు కానీ అధికార యంత్రాంగం ప్రత్యేకంగా లేకపోవడం వలన ఈ వార్డు కార్యాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు మంత్రి కేటీఆర్.

రాజకీయాలకు అతీతమైన వ్యవస్థ : నగర పౌరులకు సుపరిపాలన అందించాలన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు మంత్రి కేటీఆర్. రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవస్థ విజయవంతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. స్ధానిక ప్రజా ప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వారైనా వార్డు కార్యాలయానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ వ్యవస్థ విజయవంతం అయితే దేశం మొత్తం ఈ వ్యవస్థను అన్ని నగరాల్లో అమలు చేసే అవకాశం ఉందనే ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేసారు.

 ktr
హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుంది : ఈ వ్యవస్థ విజయవంతం అయితే దేశంలో సూపరిపాలన అందిస్తున్న నగరాలలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుందన్న నమ్మకం ఉందని కేటీఆర్ స్పష్టం చేసారు. జిహెచ్ఎంసి అధికారులు కూడా ఎవరు ఫిర్యాదు చేసినా, ఈ వ్యవస్థ ద్వారా సత్వరం వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వార్డు వ్యవస్థ కొత్తది అయినందు వలన కొద్ది రోజులపాటు కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉందని, అయినా సాధ్యమైనంత వేగంగా ఈ వ్యవస్థను సంపూర్ణంగా పనిచేసేలా పనిచేస్తామన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి వ్యవస్థను మన నగరంలో ఏర్పాటు చేయడం జరుగిందన్నారు మంత్రి కేటీఆర్.

 ktr
వార్డు స్థాయిలో పది మంది అధికారులు : వార్డు కార్యాలయానికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్చార్జిగా ఉంటారని, వాటి కార్యాలయంలో మొత్తం పదిమంది అధికారుల బృందం వివిధ శాఖల నుంచి పనిచేస్తుందని మంత్రి తెలిపారు. రోడ్డు నిర్వహణ, పారిశుధ్యము, ఎంటమాలజీ, హరితహారం, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖ, జలమండలి, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇలా పది మంది అధికారులు వార్డు స్థాయిలో జరిగే ఆయా శాఖల కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. వీరితోపాటు భవిష్యత్తులో ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ తరపున కూడా మరింత మంది అధికారులను వార్డు కార్యాలయానికి అనుసంధానం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్.

 ktr
సమస్యల పరిష్కారానికి గడుపుతో కూడిన సిటిజన్ చార్టర్ : కేవలం అధికారులను నియమించడమే కాకుండా, వారి విధుల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను చేస్తామన్నారు. పౌరుల సమస్యల పరిష్కారానికి నిర్ణీతమైన గడుపుతో కూడిన సిటిజన్ చార్టర్ కూడా జిహెచ్ఎంసి ఈ వార్డు కార్యాలయం ద్వారా పౌరులకు అందిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్బంగా కాచిగూడలో జిహెచ్ఎంసి వార్డ్ కార్యాలయ వ్యవస్థను పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించారు. నగర పాలక సంస్థ ఉన్నతాదికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+