రేపు కాలేజీలు రీ ఓపెన్..!
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు కోసం ఉన్నత విద్యాసంస్థలు తలపెట్టిన 'సాంత్వన సభ' పోరాటం సఫలమైంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో, ఈ నెల 8న (రేపు) జరగాల్సిన సభ, భారీ ర్యాలీలు వాయిదా పడ్డాయి.
ఫీజు బకాయిల సమస్య పరిష్కారం కోసం ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధులు కొద్దిసేపటి క్రితం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సానుకూల వాతావరణం నెలకొంది.

విద్యాసంస్థలకు చెల్లించాల్సిన మొత్తం రూ. 900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.ఈ మొత్తంలో, మొదటి విడతగా అత్యవసరంగా రూ. 600 కోట్లు రానున్న రెండు రోజుల్లోనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో, నవంబర్ 8న ఎల్బీ స్టేడియంలో నిర్వహించాల్సిన సాంత్వన సభ ,విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొనే భారీ ర్యాలీ కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది.
ఈ నిర్ణయం వేలాది మంది విద్యార్థులకు, ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు పెద్ద ఉపశమనం కలిగించింది. గత కొంతకాలంగా నిధులు అందక విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికంగా తీరే అవకాశం ఉంది. ఈ నిధుల చెల్లింపుతో తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తిరిగి గాడిలో పడుతుందని ఆశిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications