క్యాబినెట్ లో మహిళలకు చోటు .. అసెంబ్లీలో కేసీఆర్ స్పష్టీకరణ
హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దూసుకెళ్తోన్న సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదనే వెలితి ఉండేది. అయితే ఆ ముచ్చట కూడా త్వరలో తీరనుంది. ఇటీవల క్యాబినెట్ కూర్పులో 10 మందికి అవకాశం కల్పించిన కేసీఆర్ .. గిరిజనులు, మహిళలకు చోటు ఇవ్వలేదు. దీంతో శనివారం బడ్జెట్ పై చర్చ సందర్భంగా మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించాలని కాంగ్రెస్ నేత సబితా ఇంద్రారెడ్డి కోరగా .. అందుకు సానుకూలంగా స్పందించారు.

ఇద్దరికీ అవకాశం
రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ఓ మహిళగా కోరుతున్నానని సబితా ఇంద్రారెడ్డి బడ్జెట్ చర్చ సందర్భంగా మాట్లాడారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ .. త్వరలోనే మహిళలకు అవకాశం కల్పిస్తానని స్పష్టంచేశారు. ఇద్దరికీ చోటు ఇస్తామని అందులో ఎలాంటి సందేహం లేదన్నారాయన. అలాగే సీఎం కోటా ఎమ్మెల్సీ సీట్లలో కూడా సత్యవతి రాథోడ్ కు అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు.

ఆరుగురిలో ఇద్దరు .. మరి నలుగురు ఎవరు ?
రాష్ట్రంలో సీఎంతోపాటు 18 మంది మంత్రులకు అవకాశం ఉంది. ఇటీవల 10 మందితో మంత్రివర్గ విస్తరణ చేపట్టారు కేసీఆర్. సీఎంతోపాటు మహమూద్ అలీ ప్రమాణం చేశారు. ఇంకా ఆరుగురి మంత్రివర్గంలో అవకాశం ఉంది. అందులో ఇద్దరూ మహిళలంటే ఎవరా మహిళలనే చర్చ జరుగుతోంది. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తోన్నాయి. వీరితోపాటు పార్టీ మారిన నేతలకు కూడా పదవీ ఇస్తామని కేసీఆర్ హామీనిచ్చిన్నట్టు తెలుస్తోంది. మహిళల కేటాయింపుల సంగతి తేలితే .. మిగతా నలుగురు నేతలు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే తనకు అత్యంత విశ్వాసంగా ఉన్న వారికి, సామాజిక సమీకరణాల ఆధారంగా బాధ్యతలు అప్పగించారు. మరి ఆ నలుగురు ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది.

మహిళ సంఘాల వడ్డీలేని రుణం రూ.10 లక్షలు
మహిళ సంఘాల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టంచేశారు సీఎం కేసీఆర్. రంగారెడ్డి జిల్లాలో నెలకొల్పిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ను మహిళా సంఘాలకే అప్పగించాలని భావిస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు వారికి ఇచ్చే వడ్డీలేని రుణాన్ని రూ. 10 లక్షలకు పెంచుతున్నట్టు స్పష్టంచేశారు. ఆ నగదు మీద వడ్డీ ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని వెల్లడించారు.

ఇచ్చేది రూ.50 వేలు .. వచ్చేది రూ.24 వేలు
రాష్ట్రం కేంద్రానికి కట్టే పన్నులు రూ.50 వేల కోట్లయితే .. మనకు వచ్చేది కేవలం రూ.24 వేల కోట్లేనని స్పష్టంచేశారు. కిసాన్ సన్మాన్ పథకంతో సంబంధం లేకుండా రైతుబంధు చెక్కులు అందజేస్తామని స్పష్టంచేశారు. అలాగే రుణమాఫీ చెక్కులను రైతులకు నేరుగా అందజేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారాయన. ఇదివరకు చేసిన రుణమాఫీ సమయంలో బ్యాంకర్లు ఇబ్బందికి గురిచేశారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూస్తానని స్పష్టంచేశారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications