హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాచారంలో దారుణం: ఓ వ్యక్తిపై వడ్డీవ్యాపారి కత్తితో దాడి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదన్న కారణంతో అప్పుతీసుకున్న వ్యక్తిపై ఓ వడ్డీ వ్యాపారి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నాచారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... నాచారంలో కుమార్ గౌడ్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంల కుమార్ గౌడ్ వద్ద గిరి అనే వ్యక్తి తన అవసరం నిమిత్తం రూ. 30 లక్షల మేర అప్పు తీసుకున్నాడు. అయితే నెల నెలా క్రమంగా వడ్డీ కడుతున్నప్పటికీ ఇటీవల కాలంలో తీసుకున్న అప్పు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేశాడు. ఇచ్చింది రూ.30 లక్షలు అయితే... అసలు, వడ్డీ కలుపుకుని రూ.కోటి చెల్లించాల్సిందేనని వేధించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఆదివారం సాయంత్రం మాటామాటా పెరిగింది. దీంతో చిన్నపాటి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన కుమార్ గౌడ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గిరిపై దాడి చేశాడు. ఈ దాడిలో గిరికి తీవ్ర గాయాలయ్యాయి.

Financiar attacked in nacharam, Hyderabad

దాడిలో కత్తిపోట్లకు గురైన గాయపడిన గిరిని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని చికిత్సను అందిస్తున్న వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న నాచారం పోలీసులు కుమార్ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అతడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఆర్ధిక లావాదేవీల కారణంగా గిరిపై దాడి చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు వారు తెలిపారు. గిరి కేవలం మధ్యవర్తిగా ఉండి వేరే వ్యక్తికి అప్పు ఇప్పించాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

English summary
Financiar attacked in nacharam, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X