తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు: రెండు బోగీలు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Recommended Video
న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలులో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. హర్యానాలోని బల్లబ్గఢ్ వద్ద నేటి ఉదయం 7.45గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఓ బోగి పూర్తిగా కాలిపోయింది.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఘటన కారణంగా అదే మార్గంలో నడిచే మిగిలిన రైళ్లు ఆగిపోయాయి.

ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ముందుగా బీ1 బోగీలో చెలరేగిన మంటలు ప్యాంట్రీ.. ఆ తర్వాత ఎస్-10 బోగీకి వ్యాపించినట్లు తెలుస్తోంది.
బ్రేక్ బైండింగ్ గట్టిగా పట్టి వేయడంతో పొగలు వ్యాపించాయని ఉత్తర రైల్వే సీపీఆర్ఓ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
ప్రయాణికులకు ఎలాంటి హాని కలకగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications