హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రోన్ల ద్వారా ఫుడ్, కిరాణాసామాగ్రి డెలివరీ.. హైదరాబాద్ స్టార్టప్ గుడ్ న్యూస్ .. కానీ ట్విస్ట్ ఇదే!!

|
Google Oneindia TeluguNews

సుదూర ప్రాంతాలలో ఉన్న వారికి మందులు మరియు మెడికల్ కిట్లు చేరవేయడానికి డ్రోన్‌ను విజయవంతంగా ఉపయోగించిన తర్వాత, డ్రోన్‌లను ఇప్పుడు ఆహారం మరియు కిరాణా డెలివరీకి పలు ఫుడ్ డెలివరీ కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. ఆహారం మరియు కిరాణా డెలివరీ సంస్థ స్విగ్గీ డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి డ్రోన్‌లను అందించడంలో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ మారుత్ డ్రోనెటెక్ కీలక పాత్ర పోషిస్తోంది.

చేరికల కోసం పోటీపడుతున్న తెలంగాణా రాజకీయ పార్టీలు.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరివ్యూహం వారిదే!!చేరికల కోసం పోటీపడుతున్న తెలంగాణా రాజకీయ పార్టీలు.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరివ్యూహం వారిదే!!

డ్రోన్ల ద్వారా కిరాణా డెలివరీ చేయడానికి ట్రయల్ రన్ చేస్తున్న స్విగ్గీ

డ్రోన్ల ద్వారా కిరాణా డెలివరీ చేయడానికి ట్రయల్ రన్ చేస్తున్న స్విగ్గీ


లాజిస్టిక్స్ మరియు డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తన ఇన్‌స్టామార్ట్ ద్వారా కిరాణా డెలివరీ చేయడానికి ట్రయల్ ప్రాతిపదికన డ్రోన్‌లను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సౌకర్యం వినియోగదారులకు అందుబాటులో ఉండదు. కానీ డెలివరీ ఒక గిడ్డంగి నుండి మరొక గిడ్డంగికి ఉంటుంది. మరియు దీని కోసం, స్విగ్గీ ట్రయల్స్ నిర్వహించడానికి ఇతర కంపెనీలతో పాటు మారుత్ డ్రోనెటెక్‌ను ఉపయోగించుకుంటుంది.

మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్ట్ సక్సెస్ చేసిన మారుత్ డ్రోనెటెక్.. ఫుడ్ డెలివరీకి రెడీ

మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్ట్ సక్సెస్ చేసిన మారుత్ డ్రోనెటెక్.. ఫుడ్ డెలివరీకి రెడీ


డ్రోన్ డెలివరీ విభాగంలో, తాముతెలంగాణ ప్రభుత్వం నేతృత్వంలోని మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్ట్ కోసం పైలట్‌ను పూర్తి చేయగలిగామని మారుతి డ్రోన్ టెక్ వెల్లడించింది. మేము తెలంగాణలోనే దాదాపు 10 రోజులు 300 డ్రోన్లు అందించామని, భారతదేశంలో 1,000 డ్రోన్లు ఉన్నాయని మారుతి డ్రోన్ టెక్ పేర్కొంది. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్ట్ ద్వారా డ్రోన్‌లు వివిధ అవసరాల కోసం ఉష్ణోగ్రత నియంత్రిత బాక్సులలో 16 కిలోల వరకు భారీ బరువులను మోయగలవని నిరూపించగలిగాము, "అని మారుత్ డ్రోనెటెక్ వ్యవస్థాపకుడు ప్రేమ్ కె విస్లావత్ చెప్పారు. ఇప్పుడు ఫుడ్ విషయంలో కూడా సదరు సంస్థలకు డ్రోన్ లను అందిస్తున్నామన్నారు.

ఒక స్టోర్ నుండి మరొక స్టోర్ కు కిరాణా సామాగ్రి

ఒక స్టోర్ నుండి మరొక స్టోర్ కు కిరాణా సామాగ్రి


డ్రోన్ డెలివరీ భారతదేశానికి ఒక కొత్త విషయం అని మరియు ఇతర రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్ట్‌ను స్వీకరిస్తున్నాయని ఆయన చెప్పారు. మందులు, వ్యాక్సిన్లు సక్సెస్ ఫుల్ గా సరఫరా చేసిన విజయంతో, జూన్ నుండి హైదరాబాద్‌ లో స్విగ్గికి డ్రోన్ల ద్వారా తమ సేవలను అందించనున్నామని పేర్కొన్నారు. ఈ డ్రోన్‌లు కిరాణా సామాగ్రి మరియు ఇతర వస్తువులను ఒక స్టోర్ నుండి మరొక స్టోర్‌కి లేదా స్టోర్ నుండి ఒక సాధారణ కస్టమర్ పాయింట్‌కి బదిలీ చేయడానికి ఉపయోగించబడతాయని తెలిపారు.

 కస్టమర్ లకు నేరుగా నో డ్రోన్ ఫెసిలిటీ.. ఇది సక్సెస్ అయితే ఫ్యూచర్ లో ఛాన్స్

కస్టమర్ లకు నేరుగా నో డ్రోన్ ఫెసిలిటీ.. ఇది సక్సెస్ అయితే ఫ్యూచర్ లో ఛాన్స్


ఇక డ్రోన్లు ప్రస్తుతం కస్టమర్‌లకు నేరుగా డెలివరీని చెయ్యవని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే భవిష్యత్తులో కస్టమర్లకు నేరుగా డ్రోన్ల ద్వారా ఫుడ్, కిరాణా సామాగ్రి డెలివరీ చేసే అవకాశం లేకపోలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా డ్రోన్ టెక్నాలజీలో భారతదేశం ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది.

English summary
Hyderabad-based startup says it is working with Swiggy to deliver food and groceries via drones. But stated that this facility would not be available directly to consumers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X