దివంగత ప్రధాని పీవీకి సన్నిహితుడు, మాజీ మంత్రి మాదాడి నరసింహారెడ్డి మృతి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు అయిన మాదాడి నరసింహా రెడ్డి మృతి చెందారు. 85 సంవత్సరాల వయసున్న మాదాడి వయోభారం మీద పడడంతో, అనారోగ్య సమస్యలతో ఈరోజు తెల్లవారుజామున ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించి రెండుసార్లు మంత్రిగా కీలక పాత్ర పోషించిన మాదాడి నరసింహారెడ్డి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు.
1978 లో ఏర్పడిన శాయంపేట నియోజకవర్గం నుండి మాదాడి నరసింహారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ధర్మారెడ్డి పై గెలిచిన ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో క్యాబినెట్ మంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్లో నరసింహారెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేశారు.

వరంగల్ జిల్లాలో కీలకంగా వ్యవహరించే కొండ మురళి వంటి నాయకులను పార్టీ లో తయారు చేసిన ఘనత మాదాడి నరసింహారెడ్డిదే. దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు అత్యంత సన్నిహితుడిగా మాదాడి నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ కోసం విశేషంగా కృషి చేసిన ఆయన, మంత్రిగానూ తనదైన శైలిలో పని చేశారు. వయోభారం మీద పడడంతో గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన నేడు దివంగతులయ్యారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications