రాత్రి కిడ్నాపైన మాజీ రిపోర్టర్ కరుణాకర్ రెడ్డి దారుణ హత్య: వారిపైనే అనుమానాలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కిడ్నాప్కు గురైన మాజీ రిపోర్టర్ కరుణాకర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు కొత్తూరు పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన మామిడి కరుణాకర్ రెడ్డి(29) ఓ పత్రికలో రిపోర్టర్గా పనిచేసేవాడు. కొద్ది నెలల క్రితమే మానేశాడు.
ప్రస్తుతం కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం(ఏప్రిల్ 16) రాత్రి తన ఇంటి పక్కన ఉండే శ్రీధర్ రెడ్డితో కలిసి కారులో చేగూరు నుంచి తిమ్మాపూర్ వైపు వెళ్తుండగా.. మార్గమధ్యలో తీగాపూర్ వద్ద కాపు కాసిన దుండగులు వారిని అడ్డగించి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డిపై దాడి చేసి కరుణాకర్ రెడ్డిని మరో కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.

తీవ్రగాయాలపాలైన శ్రీధర్ రెడ్డి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మృతదేహాన్ని వదిలేసి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా.. మృతుడిని కిడ్నాపైన కరుణాకర్ రెడ్డిగా గుర్తించారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కరుణాకర్ రెడ్డి మృతి విషయం తెలియగానే ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కాగా, కొత్తూరు మండల స్థాయి ప్రజాప్రతినిధితో విభేదాలే కరుణాకర్ రెడ్డి మరణానికి దారితీశాయా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరిది ఒకే ఊరు. సదరు ప్రజాప్రతినిధి వద్ద ప్రధాన అనుచరుడిగా ఉన్న కరుణాకర్ రెడ్డి.. విభేదాల కారణంగా అతడికి దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు జరిగి కేసులు కూడా నమోదయ్యాయి. సదరు ప్రజాప్రతినిధి అనుచరులు, సొంత తమ్ముళ్లే.. కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కాగా, కిడ్నాప్ జరిగినప్పటి నుంచి ప్రజాప్రతినిధి, అతడి అనుచరుల ఫోన్లు స్విచ్ఛాఫ్లో ఉన్నాయి. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications