వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫుల్లుగా తాగాడు..ప‌క్కింటో దూరి వేధించాడు..! మ‌న‌స్తాపంతో మ‌హిళ మ్రుతికి కార‌ణ‌మ‌య్య‌డు ఎద‌వ‌..!!

|
Google Oneindia TeluguNews

హయత్‌నగర్‌/హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి దుష్ప్రవర్తన, అన్నెంపున్నెం తెలియని ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా చేసింది. పీ‌ల దాకా మందు తాగిన పక్కింటి వ్యక్తి ఇంట్లోకి దూరి అసభ్యంగా ప్రవర్తించడంతో మనస్తాపం చెందిన గృహిణి నిండు ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన హయత్‌నగర్‌లోని పవనగిరి కాలనీలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పెద్దకొండూరుకు చెందిన కొమిరెడ్డి రమేశ్‌ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇర‌వై నాలుగేళ్ల త‌న భార్య ప్రశాంతి, ఇద్దరు పిల్లలతో కలిి ఐదేళ్లుగా హయత్‌నగర్‌లోని ఓ ఇంట్లో పై అంతస్తు అద్దెకు ఉంటున్నాడు. వీరు ఉంటున్న అంతస్తులోనే గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఇర‌వై ఏడేళ్ల కుంచాల నరేశ్ అనే తాపీ మేస్త్రీ కుటుంబంతో జీవిస్తున్నాడు.

న‌లుగురికి చెప్పాల్సిన పెద్ద‌లు..! డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కవుతున్నారు..! ఛీ దీన‌మ్మా జీవితం న‌లుగురికి చెప్పాల్సిన పెద్ద‌లు..! డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కవుతున్నారు..! ఛీ దీన‌మ్మా జీవితం

Fully drunken..! misbehaved with neighbor women..! She dead with insult..!!

ఈ క్రమంలో శనివారం రాత్రి 9 గంటలకు ఫుల్లుగా తాగొచ్చిన నరేశ్‌.. తన ఇంట్లోకి బదులు ప్రశాంతి ఇంట్లోకి వెళ్లాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కింది అంతస్తులో ఉంటున్న ఇంటి యజమానికి ఫిర్యాదు చేసింది.
అప్పటికే తీవ్ర మనస్తాపం చెందిన ప్రశాంతి, ఇంట్లోకి ెళ్లి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఆ సమయంలో పాప నిద్రిస్తుండగా, బాబును బయటకు పంపించి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు తలుపులు పగులకొట్టి, మంటలు ఆర్పారు. తీవ్రగాయాలైన ప్రశాంతిని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రాణాలు విడిింది.తాగిన మ‌త్తులో ఓ ఎద‌వ చేసిన స‌న్నాసి ప‌నికి ఓ నిండుప్రాణం బ‌ల‌వ్వ‌డం అక్క‌డి వారిని క‌ల‌చివేసింది.

English summary
A man has been abused in alcohol, without having mother for two little children who have been killed her self. This tragic incident took place in the Pavanagiri colony of Hayatnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X