బెజవాడ నుండి తీసుకొచ్చి యువతిపై 15మంది రేప్
మెదక్: ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపించి విజయవాడకు చెందిన ఓ యువతిని సిద్ధిపేటకు తీసుకువచ్చి, ఆమె పైన పదిహేను మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది.
మెదక్ జిల్లా సిద్ధిపేటలోని హరిహరా రెసిడెన్సీలో ఓ యువతిపై 15 మంది వ్యక్తులు అత్యాచారం చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఓ మహిళ బాధిత యువతిని సిద్ధిపేటకు తీసుకు వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. యువతిని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
యువతి ఆత్మహత్యాయత్నం
ఆరేళ్లుగా ప్రేమించిన వ్యక్తి తనను కాదని మరో యువతితో పెళ్లికి సిద్ధపడటంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు సదరు యువతిని కాపాడారు.
వరంగల్ జిల్లా చెందిన ఆ యువతి దోమలగూడలో ఉంటూ బ్యూటీషియన్గా పని చేస్తోంది. ఈమె నివాసం పక్కనే ప్రీతమ్తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమకు దారితీసింది.
ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇంతలో ప్రీతమ్ తన మరదలిని చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. మనోవేదనతో ఆమె గురువారం సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా లేక్ పోలీసులు కాపాడారు. ఆమె కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.