సంక్రాంతి పండుగకు ముందు పేదలకు అదిరిపోయే శుభవార్త!
తెలంగాణలో అత్యంత పేదరికంతో పోరాడుతున్న కుటుంబాలకు అండగా నిలవాలని సంకల్పించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు ఒక బృహత్తర ప్రణాళికను రెడీ చేసింది. కేరళ మోడల్ తరహాలో అత్యంత నిరుపేదల నిర్మూలన లక్ష్యంగా పెట్టుకొని ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలను గుర్తించి వారిని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేయనుంది . ఈ క్రమంలో ఉన్నతాధికారులతో కీలక సమీక్షలను నిర్వహించింది.
కేరళ తరహాలో నిరుపేదల గుర్తింపుకు సర్వే
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఈ సమీక్ష సమావేశంలో ఈ కార్యక్రమం విధివిధానాలపైన చర్చించారు. కేరళ రాష్ట్రం అనుసరించిన 64,006 నిరుపేద కుటుంబాలకు గుర్తింపు ప్రక్రియను ప్రాతిపదికగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్వే నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అత్యంత నిరుపేదలను గుర్తించే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించి ఇంటింటి సర్వే నిర్వహిస్తారు.

మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా లబ్దిదారుల ఎంపిక
గ్రామీణ స్థాయిలో విస్తృత అవగాహన కలిగిన మహిళా సంఘాల ద్వారా ఇంటింటి సర్వే నుండి నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ సర్వేలో భాగంగా ఆయా కుటుంబాల ఆదాయం, నివాస గృహ స్థితి గతి, ఆరోగ్యం, పోషణ, ఉపాధి, విద్య వంటి అనేక అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. గ్రామసభల ద్వారా గ్రామస్తుల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
వీరికి ప్రత్యేక గుర్తింపు కార్డులు
ఎలాంటి రాజకీయ జోక్యానికి తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు కార్డులతో పాటు గృహవసతి లేనివారికి ఇల్లు, అనారోగ్యంతో ఉన్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా మైక్రో ప్లాన్లను కూడా రూపొందిస్తున్నారు.ఈ విధంగా కేరళ మోడల్ లో అత్యంత నిరుపేదలను గుర్తించి వారి పేదరిక నిర్మూలన కోసం చేపడుతున్న ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కాబోతోందని ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
పేదరికం నుండి వారికి విముక్తి
కడు పేదరికంలో ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం బాసటగా నిలవనుంది. ఈ కార్యక్రమం ద్వారా వారి ప్రగతికి ఏ పథకాలు అందించాలో ఆయా పథకాలను ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం వారికి చేరేలా చేయనుంది. వారిని పేదరికం నుండి బయటకు తీసుకు రావటమే లక్ష్యంగా పెట్టుకుంది.
-
మూసీపై కేబినెట్ సబ్ కమిటీ- సభ్యులు వీళ్లే -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
తెలంగాణలో ఆరోగ్య విప్లవం:పేదలకు కార్పొరేట్ వైద్యం-సీఎం రేవంత్ భారీ హెల్త్ ప్లాన్..!! -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..












Click it and Unblock the Notifications