పద్మావతి సినిమా ప్రదర్శించొద్దు, ఆందోళన చేస్తాం: ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక
హైదరాబాద్: హైద్రాబాద్లో పద్మావతి సినిమాపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ నిషేధం విధించారు. రాజాసింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గంలోని నాలుగు సినిమా థియేటర్లకు ఈ సినిమా ప్రదర్శించకూడదని రాజా సింగ్ ఆదేశించారని సమాచారం.
పద్మావతి సినిమాపై మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిషేధం విధించారు. ఈ రెండు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. కానీ, యూపీ రాష్ట్రంలో మాత్రం ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకోబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సినిమాపై ఎలాంటి నిషేధం విధించలేదు. తన నియోజకవర్గంలోని రామకృష్ణ, సంతోష్, స్వప్న, మహేశ్వరీ, పరమేశ్వరీ, వెంకటరమణ థియేటర్ల యజమానులను కలిసి ఈ సినిమాను ప్రదర్శించకూడదని కోరినట్టు రాజాసింగ్ చెప్పారు.అయితే ఈ విషయమై ఈ సినిమా థియేటర్ల మేనేజర్లు మాత్రం స్పందించేందుకు నిరాకరిస్తున్నారు.
హైద్రాబాద్ నగరంలో సుమారు 15 లక్షల మంది రాజ్పుత్లు నివాసం ఉంటున్నారు. పద్మావతి సినిమా ప్రదర్శిస్తే ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద ఆందోళన చేస్తామని రాజా సింగ్ హెచ్చరించారు.అయితే తన నియోజకవర్గ పరిధిలో ఆందోళన చేయనున్నట్టు మాత్రం రాజాసింగ్ స్పష్టం చేశారు.
ఈ సినిమాను తెలంగాణలో నిషేధించాలని కోరేందుకు తెలంగాణ సీఎం కెసిఆర్ ను కలవనున్నట్టు రాజాసింగ్ చెప్పారు.ప్రభుత్వ అనుమతితో ఈ సినిమా విడులదలైతే థియేటర్లకు రక్షణ కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications